రూపాయి ఖర్చు లేకుండా,ఇందిరమ్మ ఇండ్లు. మంత్రి వాకిటి శ్రీహరి.

మన ధ్యాస, నారయణ పేట జిల్లా :

175 కోట్లతో 3500 ఇండ్లు మంజూరు.

5 గ్రామాల్లో 78 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించిన మంత్రి వాకిటి శ్రీహరి.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరూ రూపాయి ఖర్చు పెట్టనవసరం లేకుండా, సింగిల్ ఛాయ్ సైతం తాపించాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లకు కేటాయిస్తోందని, లబ్దిదారులు త్వరగా ఇండ్లు కట్టుకొని, నాలుగు విడతల్లో 5 లక్షల రూపాయలు తీసుకోవాలని రాష్ట్ర పాడి పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, క్రీడా,యువజన మరియు మత్స శాఖామంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ మండల పరిధిలోని జక్లేర్ గ్రామంలో 19 మంది, కాట్రేవ్ పల్లి గ్రామంలో 26, ఖానాపూర్ గ్రామంలో 12 మంది, రుద్రసముద్రం గ్రామంలో 11 మంది, పారేవుల గ్రామంలో 10 మంది లబ్ధిదారులకు గాను మొత్తం 5 గ్రామాల్లో 78 మంది లబ్ధిదారులకు సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి చేతులమీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ,లబ్దిదారులు త్వరగా ఇండ్లు కోవాలని, రెండో విడతలో మరికొన్ని ఇండ్లను సైతం కేటాయిస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై గిట్టని వారు లేని పోని ప్రచారం చేస్తారని, అలాంటి వాటిని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు తొలి విడత లక్ష రూపాయలు అకౌంట్లలో జమ అయ్యాయని, వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత పదేళ్లుగా ఒక్క ఇంటిని కేటాయించలేదని, అప్పుడు ఇప్పుడు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను అందించింది కాంగ్రెస్ పార్టీ నే అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, ఎ.రవి కుమార్, కోళ్ల వెంకటేష్, కావలి తాయప్ప, మార్కెట్ డైరెక్టర్లు పారేవుల విష్ణు, శాలం, నాయకులు శంషుద్దీన్, కట్టా వెంకటేష్, కావలి ఆంజనేయులు, చెన్నయ్య గౌడ్, కల్లూరి గోవర్దన్, గుంతలి రవి, ఎంపీడీవో రమేష్, పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు