జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29
ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను పునరుద్ధరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను డిఅర్ఓ కె. మోహన్ కుమార్, ఆర్డిఓ, శ్రీనివాసులు , కలెక్టరేట్ ఏఓ వాసుదేవన్ లతో కలసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సచివాలయంలో ఉద్యోగుల తమ విధులు నిర్వర్తించడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా గతంలో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ ను జేసి జి.విద్యాధరి మరియు డిఆర్ఓ ల ఆధ్వర్యంలో పునరుద్ధరించి వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కార్పొరేట్ తరహాలో పరిశుభ్రత, పచ్చదనం పెంపు, మౌలిక వసతుల కల్పన, రికార్డుల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రికార్డు లు సమర్థవంతంగా నిర్వహిస్తే సమస్యల పరిష్కారం సులభం అవుతుందన్నారు. నూతన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను అవసరమైన అన్ని ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవచ్చునన్నారు. డిఆర్ఓ మోహన్ కుమార్ మాట్లాడుతూ సమర్థవంతమైన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పని చేయడం అధికారులు, సిబ్బంది అదృష్టమని, నేను డిఆర్ఓ గా జిల్లా పదవీ భాద్యతలు స్వీకరించి ఒక సంవత్సరం పూర్తవుతున్నదని తెలిపారు. ప్రభుత్వ అధికారులు తమ అధికారిక కార్యకలాపాల నిర్వహణకు అనువుగా వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి గతంలో జిల్లాకు విశిష్ట సేవలందించిన ఎం.నాగార్జున, ఐఏఎస్ పేరుతో జిల్లా కలెక్టర్ నామకరణం చేశారన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లాకు వచ్చిన అనంతరం తీసుకున్న నిర్ణయాల ద్వారా మార్పు మొదలైందని, త్వరలో జిల్లా అభివృద్ధి పథంలో పాయనిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. హాస్పిటల్ లు, పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని, 17 తహశీల్దార్ కార్యాలయాలలో అవసరమైన ఎం ఆర్ ఓ ఛాంబర్లు, మీటింగ్ హాల్ లు, ప్రజలు వేచి ఉండే గదులు, మరుగుదొడ్ల మరమ్మత్తులకు సహకరిస్తున్నారన్నారు. కలెక్టర్ సూచనలతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు కాంట్రాక్టర్ ల ద్వారా మాట్లాడి పనులు వేగవంతం చేశారన్నారు. కలెక్టరేట్లోని మూడు బ్లాక్ ల అధికారులు ఈ కాన్ఫరెన్స్ హాలను వినియోగించు కోవచ్చునని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి జిల్లా స్థాయి నుండి కింది స్థాయి వరకు సిబ్బంది అందరూ కలెక్టర్ కు సహకరిస్తారన్నారు. ఈ కార్యక్రమం లో చిత్తూరు ఎమ్మార్వో కుల శేఖరు, కలెక్టరేట్లోని వివిధ శాఖలకు సంబంధించిన సెక్షన్ సూపర్డెంట్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని తుఫాన్ బిల్డింగ్ మరియు టిపి నగర్ అప్పాపురం సంగం ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 2 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!