అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత, ధన్వాడ ఎస్సై రాజశేఖర్.

మన ధ్యాస, నారయణ పేట జిల్లా : సోమవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెల్లవారుజామున 5 గంటల సమయంలో కొండాపూర్ గ్రామం ప్రాథమిక పాఠశాల చౌరస్తా దగ్గర TS 12 UC 4986 నెంబర్ గల టిప్పర్ అడ్డు రాగా ధన్వాడ పోలీస్ సిబ్బంది పీ సీ తిరుమలేష్ గౌడ్ మరియు హెచ్ జీ తిరుపతిరెడ్డి అట్టి టిప్పర్ ని ఆపి తనిఖీ చేయగా ఇసుకతో నింపబడి ఉన్న కారణంగా అట్టి టిప్పర్ డ్రైవర్ ను ఇసుకను తరలించడానికి ఏమైనా ప్రభుత్వ అనుమతి పత్రాలు ఉన్నాయా అని అడగగా, అతని దగ్గర ఎలాంటి అనుమతి పత్రాలు లేవు అని తెలిపినాడు, ఇట్టి ఇసుకను కోయిలకొండ వాగు నుంచి అక్రమంగా నింపుకొని ఎక్కువ ధరకు ధన్వాడ మండల పరిధిలో అమ్ముటకు వచ్చినాను అని తెలిపినాడు. అట్టి డ్రైవర్ ను మరియు ఇసుక టిప్పర్ ను ధన్వాడ పోలీస్ స్టేషన్ కి తరలించి డ్రైవర్,పసుల నారాయణ s/o చెన్నప్ప, ఓనర్ :- ప్రభాకర్ s/o తిరుమలయ్య ల పై కేసు నమోదు చేయడం జరిగింది అని ఎస్ఐ తెలిపారు. ధన్వాడ మండల పరిధిలో పర్మిషన్ లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతదని ఎస్ఐ హెచ్చరించారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..