నేటి మీ రాశి ఫలాలు ఇలా 7th March 2025

Mana News, March 7, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు. కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం .తిధి: అష్టమి ఉదయం గం.9.18 ని.ల వరకు ఆ తర్వాత నవమి . నక్షత్రం: మృగశిర రాత్రి గం.11.32 ని.ల వరకు ఆ తర్వాత ఆరుద్ర . అమృతఘడియలు: మధ్యాహ్నం గం.2.56 ని.ల నుంచి గం.4.30 ని.ల వరకు, వర్జ్యం: లేదు , దుర్ముహూర్తం: ఉదయం గం.8.53 ని.ల నుంచి గం. 9.41 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.51 ని.ల నుంచి గం.1.39 ని.ల వరకు , రాహుకాలం: ఉదయం గం.10.30 ని.ల నుంచి గం.12.00 గం.ల వరకు , సూర్యోదయం: తె.వా. గం. 6.30 ని.లకు, సూర్యాస్తమయం: సా. గం. 6.24 ని.లకు ,మేషం :- అగ్రిమెంట్లు కుదుర్చుకోవడానికి అనుకూలమైన రోజిది. అన్ని రకాల లబ్దిని పొందుతారు. సోదరులు తోడుగా నిలుస్తారు. వృత్తిపర నైపుణ్యాలతో బాగా రాణిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మధైర్యం పెరుగుతుంది. వృషభం :- మనసులోని భావాన్ని స్పష్టంగా వ్యక్తం చేయాలి. నోటిదరుసును తగ్గించుకోవాలి. బ్యాంకు లావాదేవీలు పెద్దగా తృప్తినివ్వవు. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టాలి. ఇతరుల వల్ల ఇబ్బందులుంటాయి. ఖర్చు తగ్గించాలి. మిథునం :- ఉన్నత స్థాయికి ఎదగాలన్న ప్రయత్నాలకు మద్దతు లభిస్తుంది. వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుంటూ సాగాలి. అదృష్టం కలిసొస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విందుకు హాజరవుతారు. కర్కాటకం :- ఇంటికి దూరంగా ఒంటరిగా గడిపే సూచన ఉంది. పనులు ఆశించినట్లు సాగవు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. సింహం :- ఆనందంగా గడుపుతారు. వ్యవహారాల్లో లబ్దిని పొందుతారు. మీ ప్రయత్నాలకు తగిన సపోర్ట్ అందుతుంది. కొత్త స్నేహాలు లాభిస్తాయి. కీలక ఆకాంక్ష నెరవేరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శత్రుపీడ తగ్గుతుంది. కన్య :- నైపుణ్యానికి తగినంత గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలన్నీ శుభప్రదంగా సాగుతాయి. ఉన్నత స్థాయిలోని వారు అండగా నిలుస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరించే సూచనలు ఉన్నాయి. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. తుల :- పనులు అనుకున్నట్లుగా సాగవు. అశాంతి పెరుగుతుంది. దూర ప్రయాణం సూచిస్తోంది. ఖర్చు తగ్గించాలి. అనవసరంగా పరిహారం చెల్లించాల్సి వస్తుంది. కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. భవిష్యత్‌పై బెంగ ఉంటుంది. వృశ్చికం :- బలహీనతలే దెబ్బ తీస్తాయి. అనవసరంగా పోటీల్లో పాల్గొనకండి. ఆస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. పెద్దల కోపానికి గురవుతారు. వేళకు భోజనముండదు. ప్రత్యర్థుల బెడద ఉంటుంది. అజీర్తి సమస్య ఉంటుంది. ధనుస్సు :- ధనలాభముంది. బంధాలు బలపడతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది.విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన సమయమిది. ప్రయాణ ప్రయోజనం సిద్ధిస్తుంది. మకరం :- అభీష్టం నెరవేరుతుంది. వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కీర్తి పెరుగుతుంది. వివాదం పరిష్కారమవుతుంది. అనుబంధాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుంభం :- బద్ధకం వదిలిపెట్టాలి. ఇష్ట కార్యం చెడిపోయే సూచన ఉంది. తెలివితేటలకు తగిన గుర్తింపు ఉండదు. విశ్లేషణలు పనికి రావు. ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర గొడవలు వస్తాయి. మీనం :- ఆలోచనల తీరును మార్చుకోవాలి. వాహన సంబంధ సమస్య గోచరిస్తోంది. స్థిరాస్తి, విద్యా రంగాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి నిలకడగా లేక బంధువులతో గొడవలకు దిగుతారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

Related Posts

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్

ఎస్ఆర్ పురం, మన న్యూస్… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని టిడిపి యువ నాయకుడు సాఫ్ట్వేర్ బాలు అన్నారు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం క్రాస్ రోడ్డు జంక్షన్…

కనుల పండుగ ద్రౌపతి కళ్యాణ మహోత్సవం

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట లో మహాభారతం ఉత్సవాలు భాగంగా శుక్రవారం ఘనంగా ద్రౌపతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు