స్కంద షష్టి.. ఈ వస్తువులను దానం చేయండి- ప్రతి పనిలో విజయం మీ సొంతం..

Mana News :- స్కంద షష్టి హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ప్రతి నెలా శుక్ల పక్ష షష్ఠి తిథిని స్కంద షష్టిగా జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా భక్తుల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు నెలకొంటాయని శాంతి లభిస్తుందని నమ్మకం. సుబ్రమణ్య స్వామి భక్తులకు స్కంద షష్ఠి చాలా ముఖ్యమైనది. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పండుగ బలం, విజయం, ధైర్యానికి చిహ్నం. దృక్ పంచాంగం ప్రకారం, ఫాల్గుణ మాసం శుక్ల పక్షం షష్ఠి తిథి మార్చి 4వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:16 గంటలకు ప్రారంభం అవుతుంది. మర్నాడు మార్చి 5వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12:51 గంటలకు షష్టి తిధి ముగుస్తుంది. ఈ నేపధ్యంలో స్కంద షష్టి ఉపవాసం మార్చి 4న చేయాల్సి ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. అంతేకాదు ఈ రోజున కొన్ని దానాలు చేయడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయని వెల్లడించారు.స్కంద షష్ఠి రోజున వేటిని దానం చేయాలంటే :- స్కంద షష్ఠి రోజున పండ్లు దానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. సుబ్రహ్మణ్యం స్వామి అనుగ్రహం లభిస్తుంది. పాలు దానం చేయడం వల్ల జ్ఞానం, తెలివితేటలు పెరుగుతాయి. పెరుగు దానం చేయడం వల్ల ఆయుస్సు, ఆరోగ్యం పెరుగుతాయి. పేదలకు ఆహార ధాన్యాలు దానం చేయడం ద్వారా అన్నపూర్ణ దేవి ఆశీస్సులు లభిస్తాయి. పేదలకు బట్టలు దానం చేయడం వల్ల జీవితంలో సుఖం, సంతోషం లభిస్తాయి. నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు శాంతిని పొందుతారు. మోక్షాన్ని పొందుతారు. బెల్లం, నెయ్యి దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుంది. నీటిని దానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దాహంతో ఉన్నవారికి మీరు నీటిని అందించవచ్చు లేదా బహిరంగ ప్రదేశాలలో తాగు నీటి స్టాళ్లను ఏర్పాటు చేయవచ్చు. పేదలకు దుప్పట్లు దానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది. ఈ విషయాలను గుర్తుంచుకోండి:-దానం చేసేటప్పుడు… ఎల్లప్పుడూ శ్రద్ధ, భక్తి భావన ఉండాలి. నధర్మాలు పేదవారికి, ఆపన్నులకు చేయాలి.దానం చేసే సమయంలో నేను గొప్ప వంటి ఎటువంటి అహంకారం భావం ఉండకూడదు.దానధర్మాలు ఎల్లప్పుడూ రహస్యంగా చేయాలి. స్కంద షష్ఠి ప్రాముఖ్యత :-స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం వలన భక్తుల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ చేసే పూజ, వ్రతం, ఉపవాసం వలన కోపం, దురాశ, అహంకారం, కామం వంటి చెడు గుణాలు తొలగి సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా చేస్తుంది. పురాణ గ్రంథాల ప్రకారం స్కంద షష్ఠి రోజున కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. కనుక ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థానం లభిస్తుందని నమ్మకం.

    Related Posts

    బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్

    ఎస్ఆర్ పురం, మన న్యూస్… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని టిడిపి యువ నాయకుడు సాఫ్ట్వేర్ బాలు అన్నారు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం క్రాస్ రోడ్డు జంక్షన్…

    కనుల పండుగ ద్రౌపతి కళ్యాణ మహోత్సవం

    మన న్యూస్, ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట లో మహాభారతం ఉత్సవాలు భాగంగా శుక్రవారం ఘనంగా ద్రౌపతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి