రోహిత్‌.. ఆ 25 పరుగులతో సంతోషమా?: సునీల్ గావస్కర్

Mana News, ఇంటర్నెట్ డెస్క్: భారత సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్‌పై వస్తున్న విమర్శలను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కొట్టిపడేశాడు. జట్టు కెప్టెన్‌గా రోహిత్ దూకుడుగా ఆడుతుంటే డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం భిన్నంగా ఉంటోందని గంభీర్‌ వ్యాఖ్యానించాడు.అయితే, ఈ వ్యాఖ్యలపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తప్పుబట్టాడు. కేవలం 25 పరుగులతో కాదు.. 25 ఓవర్ల వరకూ క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించాలని సూచించాడు.”గత రెండేళ్లుగా రోహిత్ ఆడే తీరు ఇలానే ఉంటుంది. గత వన్డే ప్రపంచకప్‌ నుంచి ప్రారంభమైంది. ఇప్పటికీ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. కొన్నిసార్లు విజయవంతమైనప్పటికీ.. అతడి టాలెంట్‌కు తగ్గ ఇన్నింగ్స్‌లు మాత్రం రావడం లేదు. ఇతరులతో పోలిస్తే అద్భుతమైన షాట్లు కొట్టగలిగే నైపుణ్యం అతడి సొంతం. ఇదంతా నేను అభిమానుల కోణంలో మాట్లాడా. అయితే, జట్టుపరంగా నేనేమీ మాట్లాడలేదు. ఒకవేళ అతడు కనీసం 25 ఓవర్లు క్రీజ్‌లో ఉంటే భారత్‌ కనీసం 180 నుంచి 200 పరుగులు చేస్తుంది. అప్పటికి కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఉందనుకుందాం.. ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు దూకుడుగా ఆడే అవకాశం ఉంటుంది. అప్పుడు 350 పరుగులను చేరడం చాలా సులువవుతుంది. ఇప్పుడు రోహిత్‌ను దూకుడుగా ఆడవద్దని చెప్పడం లేదు. కానీ, సగం ఓవర్ల వరకైనా అతడు క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడు భారత్‌ విజయంపై తప్పకుండా ప్రభావం చూపిస్తాడు. ఓ బ్యాటర్‌గా నువ్వు 25-30 పరుగులతో సంతోషంగా ఉండగలవా? ఉండలేవని అనుకుంటున్నా. అందుకే, నేనొక మాట చెబుతున్నా. నీ ప్రభావం ఎక్కువగా ఉండాలంటే ఎప్పుడు ఏడెనిమిది ఓవర్లలోనే ఔట్ కాకూడదు.” అని తెలిపాడు.

Related Posts

రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, 15 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మణికొండ మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా…

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 6 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 7 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 6 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు