త్వరలో భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్..

Mana News :- ఛాంపియన్స్ ట్రోఫీలో రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో జరిగింది. దీనిని వీక్షించడానికి బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా వెళ్ళారు.ఈ సందర్భంలో భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ పునఃప్రారంభం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. లాహోర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లాను దీని గురించి అడగగా ఆయన నేరుగా ఇండైరెక్ట్ గా సమాధానం ఇచ్చారు. ది మాత్రమే కాదు, ఫైనల్ మ్యాచ్‌ను దుబాయ్‌లో కాకుండా లాహోర్‌లో నిర్వహించకూడదా అని పాకిస్తాన్ మీడియా అడిగిన ప్రశ్నకు రాజీవ్ శుక్లా వివరణ ఇచ్చారు. ముందుగా భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ ప్రశ్నకు వద్దాం. పాకిస్తాన్ మీడియా తమ దేశం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్, ఐసిసి ఈవెంట్‌లను నిర్వహిస్తోంది. భారత్, పాకిస్తాన్ మధ్య శత్రుత్వం ఇప్పుడు పోయి రెండు దేశాల మధ్య సిరీస్ ప్రారంభం కావాలని మీరు అనుకోలేదా అని రాజీవ్ శుక్లాను అడిగింది. ఈ ప్రశ్న విన్న తర్వాత రాజీవ్ శుక్లా మొదట ఐసిసి ఈవెంట్‌లు, అంతర్జాతీయ జట్లకు ఆతిథ్యం ఇచ్చినందుకు పాకిస్తాన్‌ను ప్రశంసించారు. తర్వాత భారత్-పాకిస్తాన్ సిరీస్ గురించి మాట్లాడుతూ..”భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ ప్రారంభం గురించి ఓ విషయం స్పష్టంగా ఉందని రాజీవ్ శుక్లా అన్నారు. ప్రభుత్వం కోరుకుంటేనే ఇది జరుగుతుంది. దీనిపై నిర్ణయం భారత ప్రభుత్వం చేతుల్లో ఉంది. భారత ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం బీసీసీఐ పనిచేస్తుంది. భారత్‌తో సిరీస్ ప్రారంభం గురించిన ప్రశ్నకు పాకిస్తాన్‌కు సమాధానం లభించింది. కానీ లాహోర్‌లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ గురించి అడగగా.. లాహోర్‌లో ఫైనల్ జరుగుతుందా అని పాకిస్తాన్ మీడియా అడిగిన ప్రశ్నకు రాజీవ్ శుక్లా స్పందిస్తూ, ఆస్ట్రేలియా జట్టు భారత్ ను ఓడించి ఉంటేనే ఇది సాధ్యమయ్యేదని అన్నారు.

Related Posts

రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, 15 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మణికొండ మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా…

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు