


మన న్యూస్,నిజాంసాగర్( జుక్కల్ )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అంగన్ వాడి సెంటర్ల ద్వారా ఎగ్ బిర్యానీ పథకం చిన్నారులు, బాలింతలు,గర్భిణీ స్త్రీలకు పూర్తిస్థాయిలో అందించాలని సదుద్దేశంతో ప్రభుత్వం పథకం ని చేపట్టింది.బుధవారం నిజాంసాగర్ మండలంలోని కొన్ని సెంటర్ లో మన న్యూస్ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలించగా కొన్ని సెంటర్ లో గుడ్లు సరఫరా లేనందున పిల్లలకు ఎగ్ బిర్యానీ పెట్టలేకపోయినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతి బుధవారం అంగన్ వాడి సెంటర్ లో ఎగ్ బిర్యానీ ని వండి పెట్టవలసి ఉండగా కొన్ని సెంటర్లలో మెనూ పాటించకుండా పప్పు అన్నం ఉడికించిన గుడ్డు మాత్రమే అందిస్తున్నారు.కొన్ని అంగన్ వాడి సెంటర్ లో నందు ఎగ్ బిర్యానీ అందిస్తున్నారు. మరికొందరు ఎందుకు ఎగ్ బిర్యానీ అందించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.గుడ్ల సరఫరా లేనందున ఎగ్ బిర్యానీ అందించడం లేదని అంగన్ వాడి టీచర్లు అంటున్నారు.కొన్ని సెంటర్లలో పోయిన బుధవారం ఎగ్ బిర్యానీ అందించామని ఈ వారం సరుకులు లేనందున పెట్టలేదని అంటున్నారు. అక్కడ రోజువారి గా అందించే మెనూ పరిశీలించగా పాతమేను దర్శనమిస్తుంది. అయితే పై అధికారులు ముందు చూపుగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సరుకులను సకాలంలో అందిస్తే చిన్నారులకు పౌష్టికాహారం సకాలంలో అందుతుంది.నిజాంసాగర్ ఐసిడిఎస్ సెక్టార్లు మొత్తం 27 అంగన్ వాడి కేంద్రాలు కొనసాగుతున్నాయి.ఈ సెంటర్లలో ఒక్కోసారి గుడ్లు పాడైపోయినవి వస్తున్నాయి. ఇదేంటని గ్రామస్థులు అంగన్ వాడి సిబ్బందిని ప్రశ్నించగా పైనుండి అలాగే వస్తున్నాయి.దీనికి మేమేం చేస్తామని సమాధానం చెబుతున్నారని ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారుల స్పందించి అంగన్ వాడి లో సెంటర్లలో మెనూ పాటించని సెంటర్లపై చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ విషయంపై నిజాంసాగర్ అంగన్ వాడి సూపర్ వైజర్ విజయలక్ష్మి ని మన న్యూస్ ప్రతినిధి చరవాణి ద్వారా వివరణ కోరగా ..ప్రతి బుధవారం ఎగ్ బిర్యానీ పెట్టాలని పైనుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ గుడ్ల సరఫరా, బిర్యానీ సరుకులు సకాలంలో సెంటర్లకు అందకపోవడంతో చిన్నారులకు బిర్యానీ అందించలేకపోతున్నామని తెలిపారు.ఇకనుండి సకాలంలో చిన్నారులకు పౌష్టికాహారం అందేలా చూస్తామని ఆమె అన్నారు.
