

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 25: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్న ఏఐసీసీ కార్యదర్శి తెలంగాణ ఇన్చార్జి విశ్వనాథ్ , ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ ,క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్. మరియు జిల్లా అబ్సర్వర్ వెంకటేష్ ,వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ కొంకల నాగేశ్వర్ రెడ్డి,ఆలయ ధర్మకర్త అడ్డాకుల రాము, దేవాలయ ఈవో పురెందర్ తదితరులు పాల్గొన్నారు.
