

మన న్యూస్ నారాయణపేట జిల్లా : ఎస్పీ యోగేష్ గౌతమ్ మక్తల్ పోలీసులను అభినందించి బుధవారం రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మక్తల్ పరిధిలోని పళ్ళు దొంగతనం కేసులకు సంబంధించి జూన్ నెలలో ఇద్దరు దొంగలను పట్టుకుని జైలుకు పంపించినందుకు అభినందించి రివార్డులు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి లింగయ్య మహేష్, సీఐ రామ్ లాల్, రాజేందర్ రెడ్డి, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి, క్రైమ్ పోలీసులు పాల్గొన్నారు.