అంగన్వాడి సమస్యల దశలవారీగా పరిష్కరిస్తాం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు ,మన న్యూస్:-పార్వతీపురం మన్యం జిల్లా, ప్రస్తుతం రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా 5,31,446 గర్భవతి బాలింత తల్లులు మరియు 13,03,384 మంది మూడు సంవత్సరాల లోపు పిల్లలు మరియు 7 లక్షల మంది 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఆరోగ్య మరియు పోషకాహార సేవలు అంగన్వాడీ సిబ్బంది ద్వారా అందజేయబడుచున్నవి. అంగన్వాడీ సిబ్బంది అనగా అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు తల్లీ పిల్లల ఆరోగ్యాని కై చేస్తున్న కృషి అభినందనీయం మరియు ప్రీస్కూల్ కార్యక్రమాల నిర్వహణలో కూడా కార్యకర్తలు చక్కగా పనిచేయుట కేంద్రాల సందర్శనలో గమనించడమైనది. ముఖ్యంగా 16-11-24వ తేదీన అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వద్ద వారి సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనలు చేసిన విషయం మా దృష్టికి వచ్చినది. అంగన్వాడీ సిబ్బంది యొక్క ప్రతి సమస్య మీద ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నది మరియు ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు మాసాలు మాత్రమే అయినది. దశలవారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటాము. సమ్మెలు ఆందోళనల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించబడవు మరియు సమ్మెలు చేసి కేంద్రాలు మూసివేయుట ద్వారా గర్భవతి బాలింత మహిళలు మరియు పిల్లలకు అత్యవసరమైన పోషకాహార సేవలు అందించుటకు ఆటంకం కలుగుచున్నది. అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యూటీ చెల్లింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది కావున అంగన్వాడీ సిబ్బంది అందరూ సానుకూల దృక్పథంతో ఆలోచించి లబ్ధిదారులకు సేవల జారీలో ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడవలసినదిగాను మరియు ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి సంధ్యారాణి తెలిపారు.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు