ప్రార్థన మందిరాలు, ఆర్టీసీ బస్సులు, బస్టాండ్‌లలో ముమ్మర తనిఖీలు – డాగ్ స్క్వాడ్‌తో జల్లెడ

మాదక ద్రవ్యాల రవాణా, చెలామణీపై పోలీసులు కఠిన హెచ్చరిక

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-

ప్రాంతంలో భద్రతా చర్యల భాగంగా ప్రార్థన మందిరాలు, ఆర్టీసీ బస్సులు, బస్టాండ్‌లలో సింగరాయకొండ పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు ఆదేశాల మేరకు ఈ తనిఖీలను సీఐ చావా హాజరత్తయ్య, ఎస్సై బండ్లమూడి మహేంద్ర తమ సిబ్బందితో చేపట్టారు.సింగరాయకొండ రైల్వే కూడలి మరియు జాతీయ రహదారి–16 సమీప ప్రాంతాలు మాదకద్రవ్యాల రవాణాకు అనుకూలంగా ఉన్నాయని గుర్తించి, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్‌లో డాగ్ స్క్వాడ్ సహాయంతో బస్సులు, పార్సిల్ ఆఫీస్, ప్రయాణికుల సామాను తదితరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.తదుపరి పాత సింగరాయకొండలోని శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహ క్షేత్రం, వరాహ లక్ష్మీ నారసింహ స్వామి కొండ పరిసరాల్లో కూడా పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో జల్లెడ పట్టారు.సీఐ చావా హాజరత్తయ్య మాట్లాడుతూ, “ప్రార్థన మందిరాలకు తరచూ ఆగంతకుల బెదిరింపులు వస్తున్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ ప్రాంగణాలు, పరిసరాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నాం,” అని తెలిపారు. అలాగే, “ఆర్టీసీ బస్టాండ్‌లు, బస్సులు మాదకద్రవ్యాల రవాణాకు వేదికలుగా మారకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటాం. మాదకద్రవ్యాల రవాణా లేదా చెలామణీ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు.ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ తనిఖీల్లో సింగరాయకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!