నకిలీ సర్టిఫికెట్లతో నకిలీ డాక్టర్ అరెస్ట్

మన న్యూస్,కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టార్ హాస్పిటల్ నందు రవీందర్ రెడ్డి అనే డాక్టర్ పేరుతో నకిలీ డాక్టర్ సర్టిఫికెట్,అదార్ కార్డులతో వైద్యం చేస్తున్న ముల్కల రవీందర్ అనే నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసినట్టు కామారెడ్డి అసిస్టెంట్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు.
ముల్కల రవీందర్ అనే నకిలీ డాక్టర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో గల స్టార్ ఆసుపత్రి నందు పిల్లల డాక్టర్ గా వైద్యం చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రవీందర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్టు తెలిపారు.ఇతను గాంధీ మెడికల్ కళాశాల నందు MBBS చేస్తున్నట్టు చెప్పి ఆన్ లైన్ లో మెడికల్ కౌన్సిల్ ఇచ్చే సర్టిఫికెట్ లను డౌన్ లోడ్ చేసుకుని ఆయన పేరుకు దగ్గరగా ఉన్న రవీందర్ రెడ్డి అనే డాక్టర్ సర్టిఫికెట్ లో పేరు మార్చిన నకిలీ డాక్టర్ గా వైద్యం చేస్తున్నారని తెలిపారు. ఇతను కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదని, ఇతని స్వస్థలం రామకృష్ణపూర్ గ్రామం మందమర్రి మండలం,మంచిర్యాల జిల్లా అని తెలిపారు. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ దండెం లాలయ్య కుమార్ ఫిర్యాదు మేరకు ఇతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇతడు MD జనరల్ మెడిసిన్, పిల్లల డాక్టర్ గా గతంలో పలు ఆసుపత్రుల్లో వైద్యం చేసినట్టు తెలిపారు.కేవలం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ప్రజల ప్రాణాలతో,ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు.ఇతనిపై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి, అతని వద్ద నుండి నకిలీ ఆదార్ కార్డు,నకిలీ డాక్టర్ ధ్రువపత్రాలను, ఒక ల్యాప్ టాప్,మొబైల్ ఫోన్ స్వాదీనం చేసుకుని న్యాయస్థానం ముందు హాజరు పరచడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్,రూరల్ సీఐ రామన్,ఎస్సై లు రాజు,సాయి రాం పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు