దీపావళి రహస్యం జ్ఞాన జ్యోతి వెలిగించండం • దీపావళి సందర్భంగా జ్ఞానత్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం

కుప్పం, మన ధ్యాస : దీపావళి రహస్యం జ్ఞాన జ్యోతిని వెలిగించడమేనని త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక కుప్పం కుప్పం కమిటీ అధ్యక్షులు కృష్ణ తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ధన త్రయోదశి నాడు కుప్పం, శివరాంపురం కమిటీలు సంయుక్తంగా త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కుప్పం మండలం గరిగచేనేపల్లి గ్రామంలో జరిగిన త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారంలో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రబోధానంద యోగీశ్వరులు రచించినటువంటి త్రైత సిద్ధాంత భగవద్గీతతో పాటు పలు దైవ గ్రంథాల విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా వారు దీపావళి పండుగ రహస్యాన్ని వివరిస్తూ… దీపావళి పండుగ పూట ప్రతి ఇంట దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తుందని, దీని వెనుక ప్రత్యేక పరమార్థం ఉందన్నారు. దైవాన్ని ఇంటికి ఆహ్వానిస్తూ దీపాలు వెలిగిస్తామని తెలుపుతూ, ఇంటిని మానవ శరీరంతో పోల్చారు. ఇంటిలోకి దైవాన్ని ఆహ్వానిస్తూ దీపాలు వెలిగించినట్టుగానే మానవుడు మనసులో దైవాన్ని నింపుకోవాలని సూచించారు. ఇందుకు ఏకైక మార్గం దైవ జ్ఞానాన్ని తెలుసుకోవడమేనని, ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదివి, వాటి పరమార్థాన్ని గ్రహించి మోక్ష మార్గాన్ని పొందాలని ఆశించారు. దైవ జ్ఞానాన్ని పొందిన వారిలో ప్రతినిత్యం జ్ఞాన జ్యోతి వెలుగుతూనే ఉంటుందని, అలాంటివారు మాత్రమే మోక్ష మార్గాన్ని పొందుతారని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ దైవ జ్ఞానాన్ని పొంది, జ్ఞాన జ్యోతిని తమ మనసులో వెలిగించుకుని, దైవానుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి – ఇందూ జ్ఞాన వేదిక కుప్పం కమిటీ సభ్యులు ప్రకాష్, కృష్ణారెడ్డి, శరవణ, రాజ్ కుమార్, కృష్ణమూర్తి, ఇందిరా, వెంకటలక్ష్మి, పూజ, మైత్రి లు పాల్గొన్నారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?