ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.
పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి,సంప్రదాయ పద్ధతిలో చీరలు, గాజులు, పూలు,పండ్లు అందజేశారు. అనంతరం నూతనంగా జన్మించిన శిశువులకు అన్నప్రాసన కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ —
ఆరోగ్యవంతమైన,బలమైన సమాజ నిర్మాణం పౌష్టికాహారంతోనే సాధ్యమవుతుంది.తల్లి గర్భం నుంచే ఆరోగ్య సమాజానికి పునాది వేయాలి.తల్లి మంచి పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే పిల్లలు బలంగా, ఆరోగ్యవంతంగా జన్మిస్తారు అని పేర్కొన్నారు.పిల్లలు, గర్భిణీలు,బాలింతలు,కిశోర బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడం,ఆరోగ్య అవగాహన పెంపొందించడం అత్యంత ముఖ్యమని అన్నారు.మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందని, వివిధ రకాల రోగాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మన పాత సంప్రదాయ ఆహారాలు — జొన్నలు, సజ్జలు,రాగులు, చిరుధాన్యాలు (మిల్లెట్స్) — మళ్లీ మన జీవితంలోకి తీసుకురావాలి అని సూచించారు.
ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని,గర్భిణీలు, బాలింతలు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని తెలిపారు.జుక్కల్ నియోజకవర్గంలో 39,120 కుటుంబాలు అంగన్ వాడి వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.
అలాగే, 40 అంగన్ వాడి టాయిలెట్లు మంజూరు అయ్యాయని, త్వరలోనే వాటి నిర్మాణాలు పూర్తిచేస్తామని, నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణాలు కూడా చేపడతామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ అధికారి ప్రమీల, మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, సిడిపిఓ సౌభాగ్య, కళావతి, సూపర్‌వైజర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    పేదోడి సొంతింటి కల నెరవేరింది..

    మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

    పులికల్ గ్రామంలో నకిలీ పురుగుల మందు తయారీ కేంద్రం గుట్టురట్టు15ఏళ్లుగా కోట్లలో సంపాదనఅధికారుల కనుసన్నల్లోనే నకిలీ మందులు తయారీఅధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో దాడులు

    మనధ్యాస న్యూస్ అక్టోబర్ 26: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ గ్రామంలో 15ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా నకిలీ పురుగుల మందులు తయారు చేస్తున్న కేంద్రం పై పోలీసు వ్యవసాయ అధికారులు దాడులు చేపట్టిన సంఘటన చోటు చేసుకుంది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 4 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?