భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..!

ఉదయగిరి అక్టోబర్ 28 :(మన ధ్యాస న్యూస్)://

మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు తీవ్రమైన వర్షాలు, బలమైన ఈదురు గాలులు, తీవ్ర చలిగాలుల పరిస్థితుల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముందుకు వచ్చి, స్వయంగా వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఆయన ఉదయగిరి మండలంలోని బిజ్జంపల్లి గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి, అక్కడ తాత్కాలికంగా ఆశ్రయం పొందిన బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అవసరమైన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. చలి కారణంగా ఇబ్బంది పడుతున్న 50 కుటుంబాలకు పైగా తక్షణ సాయంగా ఆయన స్వయంగా దుప్పట్లు, పండ్లు, తినుబండారాలు, తాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు.ప్రజల సంక్షేమమే తన ప్రాధాన్యత అని పేర్కొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు, తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సాయం అందించేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, తక్షణ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఆయన స్థానిక అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది చలిని దృష్టిలో ఉంచుకుని పునరావాస కేంద్రాలలో తగిన వసతి, వైద్య సదుపాయాలు, నీరు, ఆహార పదార్థాలు నిరంతరం అందించాలంటూ సూచించారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.,,,మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో – దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! కలిగిరి అక్టోబర్ 28 :(మన ద్యాసన్యూస్):// గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో కురిసిన వర్షాలు, నిన్న రాత్రి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?