సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

  • వ్యవసాయ అధికారి పి గాంధీ

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు.మండపం, గైరంపేట గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమoలో భాగంగా రైతులకు సమగ్ర ఎరువుల వాడకం గూర్చి అవగాహన కల్పించారు.వరి పంటకు హెక్టారుకు 250కిలోల యూరియాను మూడు భాగాలుగా చేసి మూడు దఫాలుగా అనగా నాటుటకు ముందు దమ్ములో, దుబ్బు చేసే దశలో మరియు అంకురదశలో బురద పదునులో మాత్రమే వేయడం ద్వారా వేసిన ఎరువు వృధాకాకుండా చూడొచ్చని వివరించారు.ప్రత్తిపoటలో హెక్టారుకు యూరియా 175కిలోలు మూడు భాగాలుగా చేసి విత్తిన 30,60,90 రోజులకు మొక్క మొదళ్ల వద్ద పాదులు తీసి వేసుకోవాలని తెలిపారు.యూరియా అందుబాటులో లేనియెడల నానో యూరియా అరలీటరు ఎకరాకు పిచికారీ చేయాలి అని , దీని తర్వాత మరలా సాంప్రదాయ యూరియా వేయనవసరం లేదని వివరించారు.అనంతరం రైతులతో వరి,ప్రత్తి పంటలను పరిశీలించి పంట నమోదు అవశ్యకతను,చీడపీడల నివారణా చర్యలను వివరించారు.ప్రతీ రైతు సేవా కేంద్ర పరిధిలో సిబ్బంది వివిధ పంటల్లో సిఫార్సు మోతాదు యూరియా గూర్చి,నానో యూరియా , నానో డి ఏ పి గూర్చి రైతులకు అవగాహన కల్పించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన సహాయకులు సురేష్,రైతులు, మహిళలు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!