విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

  • – సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి…
  • శంఖవరం కేజీబీవీ లో ఆకస్మిక తనిఖీ..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి) లో సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి. దేవానందరెడ్డి బుధవారం అకస్మక తనికీలు చేసారు. స్థానిక కెజిబివిలో ప్రతీ తరగతిలోనూ విధ్యార్థులతో మమేకమై పాఠ్యాంశాలను బోధించి, వారి నైపుణ్యాలను పరిశీలించి, విశ్లేషించారు. విద్యార్థుల విద్య, ప్రమాణాలను అంచనా వేసి, విధ్యార్థుల సామార్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులను ఆదేశించి, వలు సూచనలు చేసారు. అనంతరం ఏడవ తరగతి విద్యార్థినిలకు రాసే సామర్థ్యం పై స్వయంగా పరిశీలించారు. 9వ తరగతి విద్యార్థులకు సామాజిక శాస్త్రం నుండి “దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష వ్యతిరేకంగా పోరాటం” అనే పాఠ్యాంశం పై అర్ధగంట చదవడానికి సమయం ఇచ్చి అనంతరం విద్యార్థులచే వారు అర్థం చేసుకున్న విషయాలను వివరించమన్నారు. విద్యార్థులచే ప్రశ్నలు రూపొందింపజేసి, పీర్ క్వశ్చనింగ్ ద్వారా తరగతి మొత్తాన్ని చురుకుగా పాల్గొనేటట్లు ప్రోత్సహించారు.10, 11, 12వ తరగతి విద్యార్థులకు స్లిప్ టెస్ట్ నిర్వహించారు, ఆయనే స్వయంగా జవాబు పత్రాలను మూల్యాంకన చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాలను అంచనా వేశారు. అనంతరం కెజిబివి ఆవరణ, వసతి గృహం, వంటశాల, ప్రయోగశాలలను తనికీ చేసి, ప్రతీ ఒక్కరు పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమైన కార్యదర్శి దేవానందరెడ్డి కెజిబివి మెరుగైన నిర్వహణకు సరైన కార్యాచరణ రూపొందించుకుని, వాటిని ఆచరించాలని, విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు పలు అంశాలపై సూచనలు చేసారు. కార్యక్రమంలో కెజిబివి ప్రత్యేక అధికారి బాలాకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు.మండపం, గైరంపేట గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమoలో భాగంగా రైతులకు సమగ్ర ఎరువుల వాడకం గూర్చి అవగాహన కల్పించారు.వరి పంటకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///