సమాచార హక్కు చట్టం పై ఘనంగా అవగాహన సదస్సులు

మన న్యూస్,తిరుపతి, రాష్ట్ర సమాచార కమిషనర్, సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక కెనడీ నగర్ లోని డివిజనల్ సహకార శాఖ అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. సదరు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా సహకార అధికారి ఎస్వీ నాగవర్ధన హాజరై సమాచార హక్కు చట్టం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అలాగే జిల్లా సహకార ఆడిట్ అధికారి శ్రీ బ్రహ్మానంద రెడ్డి హాజరై సమాచార హక్కు చట్టం యొక్క విధివిధానాలు పూర్తిగా అమలు చేయాలని చెప్పారు . ఈ కార్యక్రమంలో నగర డివిజనల్ సహకార అధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం నియమ నిబంధనల ప్రకారం అభ్యర్థులు కోరిన సమాచారాన్ని నిబంధనల మేరకు పరిమితులకు లోబడి ఇవ్వాలని అలాగే వారికి సరైన సమయంలో వారు కోరిన సమాచారం ఇవ్వాలని తెలిపారు . సమాచార హక్కు చట్టం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి అంశాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి డివిజన్ లోని సహకార శాఖ అధికారులు సిబ్బంది, సహకార సంఘాల సిబ్బంది, సీఈవోలు ఇతరులు కూడా హాజరయ్యారు. అంతేకాకుండా సమావేశం అనంతరం ఒక ర్యాలీగా తిరుపతి పురవీధులలో సమాచార హక్కు చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది.

Related Posts

జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే పాఠశాలలకు సెలవులు ఇస్తారా

ఎన్నికలలో నిరుద్యోగులకు ప్రతినెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది హామీ అమ్మ ఒడి 15000 ఇస్తామని 13000 ఇవ్వడం సిగ్గో సిగ్గుఉరవకొండ మన ధ్యాస :సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ రేపు జరగబోయే విజయోత్సవ సందర్భంగా విద్యాసంస్థలు…

ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.

ఉరవకొండ మన ధ్యాస: ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సమైక్య సాధన అధ్యక్షులు మూడ్ కేశవ నాయక్, రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు కే లాలెప్ప వేరువేరు ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే పాఠశాలలకు సెలవులు ఇస్తారా

జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే పాఠశాలలకు సెలవులు ఇస్తారా

ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.

ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా సూర్యప్రభవాహనం

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా సూర్యప్రభవాహనం

డిసిసి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి ని కలిసి న భీమవరం, బుధవాడ సొసైటీ అధ్యక్షులు..////

డిసిసి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి ని కలిసి న భీమవరం, బుధవాడ సొసైటీ అధ్యక్షులు..////

ఈ లైట్లు కు మోక్షం ఎప్పుడు

ఈ లైట్లు కు మోక్షం ఎప్పుడు

సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన న్యాయమూర్తిగా జూనియర్ సివిల్ జడ్జి వి. లీలా శ్యాంసుందరి

  • By JALAIAH
  • September 9, 2025
  • 4 views
సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన న్యాయమూర్తిగా జూనియర్ సివిల్ జడ్జి వి. లీలా శ్యాంసుందరి