సమాచార హక్కు చట్టం పై ఘనంగా అవగాహన సదస్సులు

మన న్యూస్,తిరుపతి, రాష్ట్ర సమాచార కమిషనర్, సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక కెనడీ నగర్ లోని డివిజనల్ సహకార శాఖ అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. సదరు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా సహకార అధికారి ఎస్వీ నాగవర్ధన హాజరై సమాచార హక్కు చట్టం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అలాగే జిల్లా సహకార ఆడిట్ అధికారి శ్రీ బ్రహ్మానంద రెడ్డి హాజరై సమాచార హక్కు చట్టం యొక్క విధివిధానాలు పూర్తిగా అమలు చేయాలని చెప్పారు . ఈ కార్యక్రమంలో నగర డివిజనల్ సహకార అధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం నియమ నిబంధనల ప్రకారం అభ్యర్థులు కోరిన సమాచారాన్ని నిబంధనల మేరకు పరిమితులకు లోబడి ఇవ్వాలని అలాగే వారికి సరైన సమయంలో వారు కోరిన సమాచారం ఇవ్వాలని తెలిపారు . సమాచార హక్కు చట్టం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి అంశాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి డివిజన్ లోని సహకార శాఖ అధికారులు సిబ్బంది, సహకార సంఘాల సిబ్బంది, సీఈవోలు ఇతరులు కూడా హాజరయ్యారు. అంతేకాకుండా సమావేశం అనంతరం ఒక ర్యాలీగా తిరుపతి పురవీధులలో సమాచార హక్కు చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది.

Related Posts

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..