సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన న్యాయమూర్తిగా జూనియర్ సివిల్ జడ్జి వి. లీలా శ్యాంసుందరి

13వ తేదీన జరుగు లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోండి

జూనియర్ సివిల్ జడ్జి
వి. లీలా శ్యాంసుందరి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ విభాగం) నకు రెగ్యులర్ ప్రాతిపదికన న్యాయమూర్తిగా గౌరవ వి.లీలా శ్యాంసుందరి బాధ్యత తీసుకున్న నేపథ్యంలో సింగరాయకొండ బార్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇకమీదట రెగ్యులర్ గా సింగరాయకొండ కోర్టును నిర్వహిస్తారని, అదేవిధంగా ఈనెల 13వ తేదీన అనగా రెండవ శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన లోక్ ఆధాలాట్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా కేసులు త్వరితగతిన పరిష్కారం పొందేందుకు లోక్ ఆధాలాట్ మంచి వేదిక అని, దీని ద్వారా కేసులు పరిష్కారం కావడం వల్ల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని తెలిపారు.సివిల్, క్రిమినల్, వ్యాజ్యేతర కేసులు, పెండింగ్‌లో ఉన్న వివాదాలు వంటి అనేక కేసులను కోర్టులో తీర్పుకు వెళ్లకుండా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కేసులు దీర్ఘకాలం కొనసాగకుండా త్వరగా ముగించడానికి ఇది మంచి అవకాశం అని, దీనిని అందరూ వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజేసారు.కార్యక్రమంలోసింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు, కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, న్యాయవాదులు పంతగాని వెంకటేశ్వర్లు,శ్రీనివాసులు,రాఘవేంద్ర,రియాజ్ పఠన్, వంశీ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!