పాఠశాల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం: విజయవాహిని, టాటా ట్రస్ట్ పర్యవేక్షణ

మన న్యూస్ సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని గవదగట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం అసోసియేట్ కుంచాల భాస్కరరావు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఫోలిక్ ఆసిడ్ కలిగిన సన్నబియ్యం, ఫోర్టిఫైడ్ రైస్, అయోడిన్ ఉప్పు వంటివి తప్పనిసరిగా వినియోగించాలన్నారు. ఫోర్టిఫైడ్ రైస్ లో సూక్ష్మపోషకాలు ఉండటం వల్ల విద్యార్థుల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, ఐరన్ కలిగిన బెల్లం, రాగి జావ రక్తహీనత నివారణకు తోడ్పడతాయని వివరించారు. అలాగే, విటమిన్ B12 నాడీ వ్యవస్థ, రక్త ఉత్పత్తికి అవసరమని, ఫోర్టిఫైడ్ ఆయిల్ లో ఉండే విటమిన్ A, Dల వల్ల కీళ్లనొప్పులు, నరాల బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయని తెలిపారు.ఈ సందర్భంగా సంబంధిత పోషక విలువలపై అవగాహన కల్పించే F+ పోస్టర్లు పాఠశాల నిర్వాహకులకు అందజేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ సూచనల మేరకు మెనూ అనుసరిస్తూ నిత్యం విద్యార్థులకు చిక్కి, రాగి జావ, కోడిగుడ్డు వంటి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులందరూ పాఠశాలలోనే భోజనం చేస్తుండటం గర్వకారణమని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజయ్ చౌదరి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్‌పర్సన్ వాణి, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు పద్మ పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు