

దుత్తలూరు,, మన న్యూస్ : దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ వేంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలలో గురువారం జరుగు బండ్లు పొంగళ్ళు ప్రధానోత్సవం లో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్,సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. అనంతరం సమీపంలో దొడ్డి కొండపై వేంచేసియున్న ధ్యాన వెంగమాంబను దర్శించుకున్నారు. అమ్మవారి చరిత్రను అడిగి తెలుసుకున్నారు.ముందుగా అతిధులకు ఆలయ చైర్మన్ తుమ్మల సురేష్ బాబు, పచ్చ వ కరుణాకర్, వేద పండితులు ఘన స్వాగతం పలికి, శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అతిథి గృహంలో ఆతిథ్యం సేకరించారు.
ఈ కార్యక్రమంలో కాకర్ల వెంకట్, మాలేపాటి చైతన్య, వెంకటరత్నం, చీకుర్తి రవీంద్రబాబు, ఉండేలా గురువారెడ్డి, మధు రెడ్డి, గణపం సుదర్శన్ రెడ్డి, మల్లంపాటి గురవయ్య నాయుడు, చండ్ర మధుసూదన్ రావు,చీదర్ల మల్లికార్జున, మంచాల శ్రీనివాసులు నాయుడు, పాములపాటి మాల్యాద్రి, బొజ్జ నర్సింలు, రోశయ్య తదితరులు ఉన్నారు.