

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 22: ఆంద్రప్రదేశ్ లోని పాణ్యం దగ్గర మృతదేహం లభ్యం అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కట్టుకున్న అలె కడ తెర్చిందా అనే కోణంలో దర్యాప్తు,మృతుడు ఆచూకీ లభ్యంతో అనేక అనుమానాలు…ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధలతో కట్టుకున్న అలె ప్రియుడు మోజులో పడి హత్యలు జరిగిన సంఘటనలు అనేకం, కామవంచతో కాపురాలు కూల్చుకుంటున్న ఇల్లాలు, ఇంటి యజమానులు, ఆగ్యమగొచరంగా చిన్నారులు జీవితాలు.. *ప్రవేట్ సర్వేయర్ ను హత్య చేసిన బ్యాంకు ఉద్యోగి..* • అమ్మాయి తల్లితో అక్రమ సంబంధం ఉన్న బ్యాంక్ మేనేజర్ • గద్వాల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు• పిన్నాపురం చెరువు లో మృతదేహం లభ్యం • తేజేశ్వర్ కు కల్లూరు ఎస్టేట్ కి చెందిన అమ్మాయితో ప్రేమ వివాహం• లొకేషన్ ఆధారంగా మృతదేహం లభ్యం కర్నూల్ టీ.జీ మాల్ ఓ ప్రముఖ బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు దారుణానికి ఓడి కట్టాడు. గద్వాల (రాజావీధినగర్) చెందిన ప్రవేట్ సర్వేర్ గంట.తేజేశ్వర్(32) s/O గంట.జయరాములును హత్య చేశారు. కర్నూల్ లో ఓ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అదే బ్యాంకులో చిరుద్యోగితో అక్రమ సంబంధం కొనసాగుతోంది. కర్నూల్ పట్టణం కల్లూరుకు చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నాడు. మరియు కూతురితో కూడా సంబంధాలు ఉండడంతో అప్పటికే గద్వాలకు చెందిన గంట.తేజేశ్వర్ తో అమ్మాయికి లవ్ ట్రాక్ నడుస్తుంది. లవ్ ట్రాక్ నేపథ్యంలోనే అమ్మాయిని ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కర్నూల్ ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ తిరుమల రావు మరియు తల్లి ఎలాగైనా తేజేశ్వర్ ను హతమార్చాలని కుట్రపడ్డారు. బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు, తల్లి కలిసి ఎలాగైనా తేజేశ్వర్ ను హతమార్చాలని ల్యాండ్ సర్వే చెయ్యాలని చెప్పి స్నేహితుల ద్వారా రప్పించుకొని ప్రవేట్ సర్వేర్ తేజేశ్వర్ ను హత్య చేశారు. ఐదు రోజుల నుంచి తేజేశ్వర్ కనిపించకపోవడంతో అన్న తేజవర్థన్ ఫిర్యాదు మేరకు గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ లో తేజేశ్వర్ పై మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గద్వాల ఎస్పీ ప్రత్యేక బృందంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. నేపథ్యంలో శనివారం రాత్రి కర్నూల్ కు గద్వాల పోలీసులు వచ్చి విచారించారు. బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుకు సంబంధించిన స్నేహితులు ఇద్దరినీ విచారించారు. కర్నూల్ 3 టౌన్ సిఐ శేషయ్య సహకారంతో దర్యాప్తు మమ్మరం చేశారు. నేపథ్యంలో పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు సమీపంలో తేజేశ్వర్ మృతదేహం ను పోలీసులు మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా గుర్తించారు. పాణ్యం పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ప్రస్తుతం మృతదేహం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. ఈ హత్యకు సంబంధించి మరికొందరు హస్తము ఉన్నట్లు గద్వాల ఎస్సై . కళ్యాణ్ చెబుతున్నారు.
