

మన న్యూస్, తిరుపతి:రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం జూన్ 12వ తారీఖున2025 తల్లుల అందరి ఖాతాల్లో రాష్ట్రంలో 67 లక్షల 27 వేల 164 మందికి 8745 కోట్లు ఒకేసారి జమ చేయడం జరిగింది ఈ పథకం నిరుపేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వారికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని చదివించడానికి ఆసక్తి చూపుతారు మధ్యలో బడి ఆపేసిన పిల్లలు తిరిగి బడికి వచ్చేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది దేశంలో ఇంతవరకు ఇలాంటి పథకం ఇంతవరకు ఎక్కడ అమలు జరగలేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప దీనిని బట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు పేదల పట్ల నిరుపేద విద్యార్థుల పట్ల ఎంత అంకితభావం ఉందో తెలుస్తోంది అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల వారు పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఈ పథకం ఒక వరం లాంటిది గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ వడి ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత దగా చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి పేద వర్గాల మీద ఎంత ఆక్రోషం ఉందో తెలుస్తుంది దీనికి నిదర్శనమే ఈరోజు కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తా ఉంది గత ప్రభుత్వంలో నిబంధనల పేరిట లబ్ధిదారులకు అందరికీ కోతల విధించింది ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వాన్ని మరొక్కసారి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రుజువు చేసింది అందుకు ఉదాహరణ తల్లిదండ్రులందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వైసిపి నాయకులారా మీ తప్పుడు గ్లోబల్ ప్రచారాన్ని ఆపండి.ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం , పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు ., రజక సాధికార కమిటీ రాష్ట్ర మెంబర్ ఎస్ శంకర్ , బీసీ నాయకులు రవిశంకర్ యాదవ్ గారు పిల్లల తల్లిదండ్రులు పెంచలయ్య, మల్లికార్జున్, బాలకృష్ణ, గిరి, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.