జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- మరణ మృదంగం వాయిస్తూ, శవాలను చూసి నవ్వుతూ, తనలో తానే మాట్లాడుకుంటూ, అయిన వారి చావు లపై వచ్చే సానుభూతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి క్రూరత్వానికి సింగయ్య బలయ్యాడని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు ఆరోపించారు.జులాయిగా తిరుగుతూ బెట్టింగ్ కార్యకలాపాలతో నష్టపోయి అప్పులపాలయ్యి ఒక సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకున్న ఒక అక్రమార్కుడి చావును రాజకీయంగా ఉపయోగించుకొని లబ్ది పొందాలన్న దురాశతో జగన్ రెడ్డి పల్నాడు పర్యటనకు వచ్చి ఇద్దరి మరణానికి కారణమై మరోసారి తన క్రూరత్వాన్ని చూపించుకున్నాడని ఆరోపించారు.తన పేదరికం కష్టాలు తీర్చుకోవడానికి రోజువారీ కూలి పనులకు వెళ్ళే సాధారణ దళిత వ్యక్తి సింగయ్య జగన్ రెడ్డి కారు క్రింద పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే వైసిపి అధినేత కనీసం దిగి అతన్ని హాస్పిటల్ కు పంపే ప్రయత్నం కూడా చేయకపోవడం జగన్ నిర్దయ మనస్తత్వాన్ని తెలియజేస్తోంది.నరుకుతాం, తొక్కుతాం అని చెప్పి మరీ ఇద్దరిని పొట్టనపెట్టుకున్న జగన్ రెడ్డి కర్కసత్వానికి ఇంకెన్ని ప్రాణాలు బలి కావాలని ప్రశ్నించారు. స్వర్గీయ సింగయ్య మృతికి కారణమైన జగన్ రెడ్డి పైన హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి, వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, చిన్నారెడ్డి, సెల్వం, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. యం.ఉమేష్ రావు, తిరుపతి పార్లమెంటు నాయకులు పేట బాలాజీ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, వజ్రం కిషోర్, యం.యస్.రెడ్డి, అంకయ్య గౌడ్, భాస్కర్ గౌడ్, హరి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

మన న్యూస్,తిరుపతి:తమిళనాడు రాష్ట్రం మదురైలో హిందూ మున్నానీ సంస్థ నిర్వహించిన మురుగన్ భక్తుల మహానాడులో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం విమానాశ్రయంకు చేరుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఆరణి మదన్. తిరుపతి నుంచి సభలో పాల్గొనేందుకు…

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

మన న్యూస్, తిరుపతి:రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం జూన్ 12వ తారీఖున2025 తల్లుల అందరి ఖాతాల్లో రాష్ట్రంలో 67 లక్షల 27 వేల 164 మందికి 8745 కోట్లు ఒకేసారి జమ చేయడం జరిగింది ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు

జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు