

మన న్యూస్ : ఉదయగిరి
→ పేగుపూత వ్యాధితో బాధపడుతున్న కాశీ
→ విషయం తెలుసుకొని చలించిపోయిన మన్నేటి
→ తక్షణ సహాయం క్రింద 10వేలు అందజేసిన మన్నేటి
ఉదయగిరి గిరిజన కాలనీ కి చెందిన కరంగుల కాశీ కొన్ని రోజుల నుండి పేగు పూత వలన తీవ్ర అనారోగ్యం తో బాధ పడుతున్నాడు. వైద్యం చేపించుకునేందు ఆర్ధిక స్థోమత లేక దాతలు కోసం ఎదురు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి చలించిపోయారు. మన ఫౌండేషన్ తరపున తక్షణ సహాయం క్రింద కాశీ భార్య జ్యోష్ణ కి 10,000 (పది వేలు ) ఆర్ధిక సహాయం చేశారు మన్నేటి వెంకటరెడ్డి. ఈ నగదుతో వైద్యం చేపించుకోవాలని జ్యోష్ణ కి తెలియజేశారు. కాశీ త్వరగా కోలుకోవాలని, సంతోషంగా కుటుంబంతో గడపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మన ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.