

మన న్యూస్, నెల్లూరు ,జూన్ 19: నెల్లూరు లీలామహల్ దగ్గర, బిఎస్ఎన్ఎల్ ఎదురుగా గురువారం ఉదయం మదిన వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ ” కింగ్స్ కేఫ్” ను ప్రారంభించినారు.ఈ సందర్భంగా షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ…… కింగ్స్ కేఫ్ లో ఎలాంటి పౌడర్లు లేకుండా రుచికరమైన, నాణ్యమైన టీ ని తయారు చేస్తున్నారు ,నెల్లూరు అంటే మంచి క్వాలిటీ ఫుడ్ కి పేరు ఉంది. ఒకసారి” కింగ్స్ కేఫ్ “వచ్చి టీ ఆస్వాదించి” కింగ్స్ కేఫ్ “వారిని ప్రోత్సహించవలసినదిగా కోరు చున్నాను అని అన్నారు. కింగ్స్ కేఫ్ అధినేత కిరణ్ తేజ్ మాట్లాడుతూ….. మన గోల్డెన్ హ్యాండ్ మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ కింగ్స్ కేఫ్ ను ప్రారంభించడానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. నాకు ఎలాంటి పరిచయం లేకపోయినా ఇంతియాజ్ ఫుల్ బిజీగా ఉండి కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా కింగ్స్ కేఫ్ కి ప్రారంభానికి వచ్చినందుకు వారికి ఆ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. నెల్లూరు నగర ప్రజలు మా కింగ్స్ కేఫ్ వచ్చి మా టీ ని ఆస్వాదించి మమ్మల్ని ప్రోత్సహించవలసినదిగా కోరుచున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కింగ్స్ కేఫ్ అధినేత షేక్ కిరణ్ తేజ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.





