

దుత్తలూరు, మన న్యూస్ : దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ వేంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు పసుపు కుంకుమ కార్యక్రమం తదుపరి అమ్మవారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ కమనీయంగా నిర్వహించారు. అమ్మవారికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయాన్నే అమ్మవారికి గురవయ్య నాయుడు దంపతులకు అభిషేక కార్యక్రమాలు జరిపించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ వేదికపై అధిష్టింప చేశారు. వేద పండితులు అమ్మవారి కళ్యాణాన్ని శాస్త్ర విధిగా జరిపించారు. ముందుగా అమ్మవారి చరిత్రను వివరిస్తూ భక్తులకు తెలిపారు.అనంతరం అమ్మవారి కళ్యాణ తంతును శాస్త్రవిధిగా వేదమంత్రాలతో నిర్వహించారు. కళ్యాణ ఘట్టంలో అతి ముఖ్యమైనది గుణజీర ధారణ గావించారు. తదుపరి మాంగల్య ధారణ గావించారు. మాంగల్యాన్ని భక్తులందరికీ దర్శించే విధంగా దర్శన భాగ్యం కలిగించారు. కళ్యాణంలో చివరిగా ముత్యాల తలంబ్రాలను పోశారు. భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని కనులారా దర్శించి మానసిక ఆనందాన్ని పొందారు. తీర్థ ప్రసాదములు స్వీకరించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమాలను ఆలయ ఈవో ఉషశ్రీ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావలి డిఎస్పి పి శ్రీధర్ కలిగిరి సి ఐ వెంకటనారాయణ ఇతర మండలాల ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కుమార్తె ఎం దీపా వెంకట్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, కాకర్ల వెంకట్, మల్లంపాటి గురవయ్య నాయుడు, మాలేపాటి చైతన్య, ఉండేలా గురవారెడ్డి, దామా మహేష్, పేలపూడి వెంకటరత్నం, ఎల్ సి రమణారెడ్డి, శ్రీ కుర్తి రవీంద్రబాబు, చంద్ర మధుసూదన్ రావు, గణపం సుదర్శన్ రెడ్డి కొట్టే వెంకటేశ్వర్లు మధుమోహన్ రెడ్డి సోదరులు మల్లికార్జున గూడ నరసారెడ్డి, గాలి రామ్మోహన్ నాయుడు, బొల్లినేని రామారావు, ఆలయ పాలకమండలి చైర్మన్లు తుమ్మల సురేష్ బాబు, పచ్చవ కరుణాకర్, పచ్చవ వెంకటేశ్వర్లు, పచ్చవ వెంగయ్య వేమూరి ముసలయ్య ఇతర సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.