విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం..బగ్గుమన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: బగ్గుమన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
భయంతో పరుగులు తీసిన స్థానికులు
ఏలేశ్వరం ప్రధాన రహదారిలో పాత బస్టాండ్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి ఒకసారిగా మంటలు చల్లరేగాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి.ఏలేశ్వరం ప్రధాన రహదారిలో ప్రతినిత్యం రద్దీ గుండె పాత బస్టాండ్ సెంటర్లో విద్యుత్ వినియోగం కోసం మూడు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం ట్రాన్స్ఫార్మర్ నుండి ఒక్కసారిగా మంటలు రావడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా ఒకసారిగా ఉలిక్కిపడి పరుగులు తీశారు. హఠాత్తుగా చెలరేగిన మంటలకు ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది ఏమో అన్ని భయంతో ఒకరినొకరు తొక్కుకుంటూ తమ వాహనాలు వదిలి పరుగులు తీశారు.ఈ ట్రాన్స్ఫార్మర్లకు కుత దూరం మద్యం షాపు మరోవైపు టీ టైం రద్దీగా ఉన్నాయి. సాయంత్రం కావడంతో ఓవైపు మద్యం ప్రియులు మరో వైపు చాయ్ ప్రియులు గుమ్మిగూడు ఉన్నారు. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ లో మంటలు రావడంతో అదిరిపాటుగా ఉన్న వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. మరికొంతమందికి అయితే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయం స్థితిలో ఉండిపోయారు. కాగా విద్యుత్ శాఖ అధికారులు ఒకరోజు ముందే ఈ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.ఒక రోజులోనే ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని ఇసుకతో మంటలను అదుపు చేశారు. దీనితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.కాగా విద్యుత్ ప్రమాదాలకు దారి తీస్తున్న సంఘటనలు పరిశీలిస్తే విద్యుత్ అధికారులు వైఫల్యాలు ఎక్కువ కనబడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్కడ చూసినా వేలాడుతూ తెగిపడిన వైర్లు,విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనాలుగా కనబడుతున్నాయి.

  • Related Posts

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    శ్రీకాళహస్తి, మన న్యూస్ :- మరణ మృదంగం వాయిస్తూ, శవాలను చూసి నవ్వుతూ, తనలో తానే మాట్లాడుకుంటూ, అయిన వారి చావు లపై వచ్చే సానుభూతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి క్రూరత్వానికి సింగయ్య బలయ్యాడని…

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    మన న్యూస్,తిరుపతి:తమిళనాడు రాష్ట్రం మదురైలో హిందూ మున్నానీ సంస్థ నిర్వహించిన మురుగన్ భక్తుల మహానాడులో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం విమానాశ్రయంకు చేరుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఆరణి మదన్. తిరుపతి నుంచి సభలో పాల్గొనేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

    జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు

    జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు