

మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ పరిధిలో గౌదగట్ల వారి పాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు సోమరాజుపల్లి గ్రామానికి చెందిన వల్లెపు మాల్యాద్రి – సుకన్య దంపతుల కుమారుడు వీర గణేష్వక్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు పలకలు, నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు మరియు మిఠాయిలను అందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ, విద్యార్థుల జీవితాల్లో సానుకూల భావోద్వేగాలను పెంపొందించేందుకు ఈ తరహా సామాజిక కార్యక్రమాలు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. చిన్నతనం నుంచే సేవా దృక్పథాన్ని అలవర్చుకోవడం వల్ల, భవిష్యత్లో సమాజం పట్ల నిస్వార్థంగా వ్యవహరించే వ్యక్తులు ఎదుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. మాల్యాద్రి – సుకన్య దంపతులు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి, విద్యార్థులకు అవసరమైన పాఠ్య సామాగ్రి అందించి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజయ్ చౌదరి, అనురాధ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.