

మన న్యూస్,దుత్తలూరు : దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామంలో చిరు అంగడి పెట్టుకుని జీవిస్తున్న వృద్ధ దంపతులైన పరుచుబోయిన వెంకటేశ్వర్లు స్వర్ణలత గార్ల మీదకు వాహనం వెళ్లి ఢీకొట్టన సంఘటనలో వారు ఇరువురు ప్రమాదంలో మృతి చెందారు. మృతి చెందిన వారి స్వగ్రామమునకు వెళ్లి వారి ఇరువురి పార్థివ దేహానికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేసి, ప్రభుత్వం ద్వారా అందవలసిన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని, వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రమాద సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాకర్ల వెంకట్, మధు రెడ్డి, రోశయ్య, స్థానిక నాయకులు, గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.