బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

బంగారుపాళ్యం డిసెంబర్ 7 మన ధ్యాస

బంగారుపాళ్యం మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా మెయిన్ రోడ్ పక్కనే కాలువ లేక ప్రవహిస్తున్న మురుగు నీరు? పలుమార్లు పేపర్లకు వేసిన అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోని వైనం. వివరాల్లోకి వెళితే మండల కేంద్రం, రోడ్డుకు ఇరువైపులా కూడా నిత్యం వ్యాపారలు జరిగే అంగుళ్ళు మరియూ అనునిత్యం జన సంచారంతో రద్దీ. అదే కాలువ దగ్గర వాహనాలు ఆపాలి, ఆ కాలువనే దాటుకుని వెళ్లి నిత్యవసారాలు మరియూ ఇతరత్ర కొనాలి మళ్ళీ తిరిగి ఆ కాలువ మీదగానే రావాలి. ఎంతో మంది కాలు జారీ ఆ మురుగు నీటి కాలువలో పడడం కూడా జరిగింది. అయినా ఏ అధికారీ పట్టించుకోడు, ఎందుకంటే వారికి సంవత్సరానికి ఒకసారి టాక్స్ వసూలు చెయ్యడం మాత్రమే ముఖ్యం. ఇవ్వంతా హెల్త్ డిపార్ట్మెంట్కి కనపడవా?పలమనేరు మరియూ చిత్తూరు ఎక్కడికి ప్రయాణం చెయ్యాలన్నా కూడా ప్రతి ఒక్కరూ అదే రోడ్డులో ప్రయాణం చెయ్యాలి. అయినా ఇన్ని సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోకపోవడం సిగ్గు చేటు. కొత్త కొత్త రోగాలు వచ్చి జనాలు పోతుంటే, ఇలాగ కాలువలు రోడ్ల మీదనే వదిలిపెడితే, ప్రజలు మరియూ అక్కడ వ్యాపారాలు చేసుకునే వారు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారో కొంచం అయినా పట్టించుకుంటే అధికారులు బాగుంటుంది. అంతే కాక ఈ మురుగు నీటి కాలువ నేరుగా పక్కనే ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ముందు వైపే వెళ్తుంది, వచ్చే రోగులు ఇంకా రోగాలు పెంచుకోడానికా అన్నట్లు ఉంది. దయచేసి ఇకనైనా సంబంధిత అధికారులు (హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీ సిభంది,హెల్త్ మినిస్టర్ మరియూ దీనికి సంబంధిత శాఖ) వెంటనే స్పందించి ఈ మురుగు నీరు ఇలా రోడ్ల మీదకు రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి. ఇది ఇంకా కూడా ఇలానే ఈ ప్రభుత్వంలో కూడా పట్టనట్లు వదిలేస్తే 100% పై స్థాయిలో (మంత్రి నారా లోకేష్ కి) కంప్లైంట్ చేయవలసి వస్తుంది. ఈ ఫొటోస్ చూసి అయినా స్పందించండి ఒక వేల మాకు తెలియదు అని చెప్పాలి అనుకుంటే. మేము పడుతున్న ఇబ్బందులు అర్థం చేసుకుని సహకరిస్తారని ఆశిస్తున్నాము

  • Related Posts

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ ,…

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు