నర్రవాడ లోని కమనీయం శ్రీ వెంగమాంబ కళ్యాణం ..!పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

దుత్తలూరు, మన న్యూస్ : దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ వేంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు పసుపు కుంకుమ కార్యక్రమం తదుపరి అమ్మవారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ కమనీయంగా నిర్వహించారు. అమ్మవారికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయాన్నే అమ్మవారికి గురవయ్య నాయుడు దంపతులకు అభిషేక కార్యక్రమాలు జరిపించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ వేదికపై అధిష్టింప చేశారు. వేద పండితులు అమ్మవారి కళ్యాణాన్ని శాస్త్ర విధిగా జరిపించారు. ముందుగా అమ్మవారి చరిత్రను వివరిస్తూ భక్తులకు తెలిపారు.అనంతరం అమ్మవారి కళ్యాణ తంతును శాస్త్రవిధిగా వేదమంత్రాలతో నిర్వహించారు. కళ్యాణ ఘట్టంలో అతి ముఖ్యమైనది గుణజీర ధారణ గావించారు. తదుపరి మాంగల్య ధారణ గావించారు. మాంగల్యాన్ని భక్తులందరికీ దర్శించే విధంగా దర్శన భాగ్యం కలిగించారు. కళ్యాణంలో చివరిగా ముత్యాల తలంబ్రాలను పోశారు. భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని కనులారా దర్శించి మానసిక ఆనందాన్ని పొందారు. తీర్థ ప్రసాదములు స్వీకరించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమాలను ఆలయ ఈవో ఉషశ్రీ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావలి డిఎస్పి పి శ్రీధర్ కలిగిరి సి ఐ వెంకటనారాయణ ఇతర మండలాల ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కుమార్తె ఎం దీపా వెంకట్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, కాకర్ల వెంకట్, మల్లంపాటి గురవయ్య నాయుడు, మాలేపాటి చైతన్య, ఉండేలా గురవారెడ్డి, దామా మహేష్, పేలపూడి వెంకటరత్నం, ఎల్ సి రమణారెడ్డి, శ్రీ కుర్తి రవీంద్రబాబు, చంద్ర మధుసూదన్ రావు, గణపం సుదర్శన్ రెడ్డి కొట్టే వెంకటేశ్వర్లు మధుమోహన్ రెడ్డి సోదరులు మల్లికార్జున గూడ నరసారెడ్డి, గాలి రామ్మోహన్ నాయుడు, బొల్లినేని రామారావు, ఆలయ పాలకమండలి చైర్మన్లు తుమ్మల సురేష్ బాబు, పచ్చవ కరుణాకర్, పచ్చవ వెంకటేశ్వర్లు, పచ్చవ వెంగయ్య వేమూరి ముసలయ్య ఇతర సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

  • Related Posts

    బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం గ్రామంలో లింగంపర్తి రోడ్లో,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక బసవ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు ఆచారి నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.…

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    శ్రీకాళహస్తి, మన న్యూస్ :- మరణ మృదంగం వాయిస్తూ, శవాలను చూసి నవ్వుతూ, తనలో తానే మాట్లాడుకుంటూ, అయిన వారి చావు లపై వచ్చే సానుభూతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి క్రూరత్వానికి సింగయ్య బలయ్యాడని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    బసవ గోశాల ట్రస్ట్ లో  గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు