విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ సమీక్ష సమావేశం..!మెట్ట ప్రాంత రైతులను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సమస్యలు లేకుండా పరిష్కరించండి..!అధికారులకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

వింజమూరు మన న్యూస్ : మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో రైతన్నలు ముఖ్యంగా బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం సాగు చేస్తున్నారని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా విద్యుత్తును అందజేయాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
శుక్రవారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు విద్యుత్ శాఖ జిల్లా డివిజన్ మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో అధికంగా విద్యుత్ సమస్యలు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మ్స్ కాలిపోయిన ప్రదేశంలో వెంటనే రీప్లేస్మెంట్ చేయకపోవడం వల్ల పంట ఎండిపోతుందన్నారు. శిథిలావస్థకు చేరిన స్తంభాలు, విద్యుత్ వైర్లు అనేక ప్రాంతాల్లో ఉన్నాయని వాటిని మార్చాలని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో స్తంభాలు లేకుండా కర్రలపై వైర్లు లాగి ఉన్నారని వాటి వల్ల ప్రమాదం పొంచి ఉందన్నారు. వాటి స్థానాల్లో స్తంభాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలు లేకుండా, ప్రతిరోజు 9 గంటల విద్యుత్ నిరంతరాయంగా అందజేయాలని తెలిపారు. రైతులు బాగుంటేనే మనమందరం బాగుంటామని వారికోసం మనం చేయిదగిన పనులన్నీ చేయాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్ అందించేందుకు కృషి చేస్తుందని అధికారులు తెలియజేశారు. దీనికి అనుగుణంగా రైతులు సంసిద్ధం కావాలన్నారు. అదేవిధంగా ఇంటిపై కూడా సోలార్ ఏర్పాటు చేసుకొని విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం ద్వారా రాయితీ మరియు రుణం అందజేయడం జరుగుతుందన్నారు. కావున అవకాశాన్ని ప్రజలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఈ విజయన్ , ఈ ఈ ఐ శ్రీనివాసులు ఏడి ఈ కృష్ణమోహన్, వింజమూరు ఏఈ నాగూర్ వలి జలదంకి కలిగిరి కొండాపురం మండలాల ఏఈలు లైన్మెన్లు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత ప్రిన్సిపల్

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవంను జాతీయ సేవ పథకం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి…

    జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

    మన న్యూస్ తవణంపల్లె జూన్-26 మండలంలోని అరగొండలో గల అపోలో ఇషా విద్యాలయంలో చదువుతున్న వెంగంపల్లె కు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి నక్కల హేమభూషన్ రెడ్డి కుమార్తె నక్కల ఝాన్షి రెడ్డి పీఎం జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత ప్రిన్సిపల్

    మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత  ప్రిన్సిపల్

    జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

    జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

    ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

    ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

    తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

    తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

    వెన్న శివ ఆధ్వర్యంలో వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

    వెన్న శివ ఆధ్వర్యంలో  వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

    జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

    జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..