

వింజమూరు మన న్యూస్ : మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో రైతన్నలు ముఖ్యంగా బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం సాగు చేస్తున్నారని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా విద్యుత్తును అందజేయాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
శుక్రవారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు విద్యుత్ శాఖ జిల్లా డివిజన్ మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో అధికంగా విద్యుత్ సమస్యలు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మ్స్ కాలిపోయిన ప్రదేశంలో వెంటనే రీప్లేస్మెంట్ చేయకపోవడం వల్ల పంట ఎండిపోతుందన్నారు. శిథిలావస్థకు చేరిన స్తంభాలు, విద్యుత్ వైర్లు అనేక ప్రాంతాల్లో ఉన్నాయని వాటిని మార్చాలని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో స్తంభాలు లేకుండా కర్రలపై వైర్లు లాగి ఉన్నారని వాటి వల్ల ప్రమాదం పొంచి ఉందన్నారు. వాటి స్థానాల్లో స్తంభాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలు లేకుండా, ప్రతిరోజు 9 గంటల విద్యుత్ నిరంతరాయంగా అందజేయాలని తెలిపారు. రైతులు బాగుంటేనే మనమందరం బాగుంటామని వారికోసం మనం చేయిదగిన పనులన్నీ చేయాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్ అందించేందుకు కృషి చేస్తుందని అధికారులు తెలియజేశారు. దీనికి అనుగుణంగా రైతులు సంసిద్ధం కావాలన్నారు. అదేవిధంగా ఇంటిపై కూడా సోలార్ ఏర్పాటు చేసుకొని విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం ద్వారా రాయితీ మరియు రుణం అందజేయడం జరుగుతుందన్నారు. కావున అవకాశాన్ని ప్రజలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఈ విజయన్ , ఈ ఈ ఐ శ్రీనివాసులు ఏడి ఈ కృష్ణమోహన్, వింజమూరు ఏఈ నాగూర్ వలి జలదంకి కలిగిరి కొండాపురం మండలాల ఏఈలు లైన్మెన్లు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.