జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

మన న్యూస్ తవణంపల్లె జూన్-26

మండలంలోని అరగొండలో గల అపోలో ఇషా విద్యాలయంలో చదువుతున్న వెంగంపల్లె కు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి నక్కల హేమభూషన్ రెడ్డి కుమార్తె నక్కల ఝాన్షి రెడ్డి పీఎం జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన 9వ తరగతి ప్రవేశ పరీక్షలో అద్భుత విజయాన్ని సాధించింది. తన దీర్ఘకాలిక కృషి, పట్టుదల, గురువుల మార్గదర్శకంతో ఈ విజయాన్ని అందుకున్న ఝాన్షి ప్రస్తుతం తన కుటుంబానికి, పాఠశాలకి గర్వకారణంగా నిలిచింది.

ఝాన్షి తండ్రి గారు ఒక మాజీ ఆర్మీ ఉద్యోగి. క్రమశిక్షణ, అంకితభావం ఆమె కుటుంబ సంప్రదాయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. చదువులో ఎల్లప్పుడూ ప్రథమ స్థానంలో నిలిచే ఝాన్షి ఈసారి జిల్లా స్థాయి పోటీలోనూ తన ప్రతిభను చాటింది.

ఈ సందర్భంగా అపోలో ఇషా విద్యాలయ యాజమాన్యం, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు ఆమెను హృదయపూర్వకంగా అభినందించారు. “ఝాన్షి వంటి విద్యార్థులు మా పాఠశాల కీర్తిని పెంపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఆమె ఇంకా పెద్ద విజయాలను సాధించాలని ఆశిస్తున్నాం” అని స్కూల్ ప్రిన్సిపల్ మరియు సహచర ఉపాధ్యాయులు తెలిపారు. అలాగే వెంగంపల్లె గ్రామంలోని ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు తను ఇంకా బాగా చదివి పుట్టిన ఊరికి చదివిన పాఠశాలకు మంచి పేరు తీసుకు రావాలని దీవించారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///