జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

మన న్యూస్ తవణంపల్లె జూన్-26

మండలంలోని అరగొండలో గల అపోలో ఇషా విద్యాలయంలో చదువుతున్న వెంగంపల్లె కు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి నక్కల హేమభూషన్ రెడ్డి కుమార్తె నక్కల ఝాన్షి రెడ్డి పీఎం జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన 9వ తరగతి ప్రవేశ పరీక్షలో అద్భుత విజయాన్ని సాధించింది. తన దీర్ఘకాలిక కృషి, పట్టుదల, గురువుల మార్గదర్శకంతో ఈ విజయాన్ని అందుకున్న ఝాన్షి ప్రస్తుతం తన కుటుంబానికి, పాఠశాలకి గర్వకారణంగా నిలిచింది.

ఝాన్షి తండ్రి గారు ఒక మాజీ ఆర్మీ ఉద్యోగి. క్రమశిక్షణ, అంకితభావం ఆమె కుటుంబ సంప్రదాయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. చదువులో ఎల్లప్పుడూ ప్రథమ స్థానంలో నిలిచే ఝాన్షి ఈసారి జిల్లా స్థాయి పోటీలోనూ తన ప్రతిభను చాటింది.

ఈ సందర్భంగా అపోలో ఇషా విద్యాలయ యాజమాన్యం, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు ఆమెను హృదయపూర్వకంగా అభినందించారు. “ఝాన్షి వంటి విద్యార్థులు మా పాఠశాల కీర్తిని పెంపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఆమె ఇంకా పెద్ద విజయాలను సాధించాలని ఆశిస్తున్నాం” అని స్కూల్ ప్రిన్సిపల్ మరియు సహచర ఉపాధ్యాయులు తెలిపారు. అలాగే వెంగంపల్లె గ్రామంలోని ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు తను ఇంకా బాగా చదివి పుట్టిన ఊరికి చదివిన పాఠశాలకు మంచి పేరు తీసుకు రావాలని దీవించారు.

Related Posts

పంట కాలువల పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 2 కోట్ల 28 లక్షల రూపాయలవ్యయం తో సాగునీటి కాలువల పూడికతీతలు మరమ్మత్తులకు పనులకు ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం…

మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ చేపట్టిన ప్రత్తిపాడు సర్కిల్ పోలీసులు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ పరిధిలో అవగాహన ర్యాలీ చేపట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అవగాహన ర్యాలీలో నాలుగు మండలాల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పంట కాలువల పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ

పంట కాలువల పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ

మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ చేపట్టిన ప్రత్తిపాడు సర్కిల్ పోలీసులు

మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ చేపట్టిన ప్రత్తిపాడు సర్కిల్ పోలీసులు

గోలపల్లి ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ విరాళం.

గోలపల్లి ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ విరాళం.

మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత ప్రిన్సిపల్

మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత  ప్రిన్సిపల్

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక