

వింజమూరు మన న్యూస్ : వింజమూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నల్లగొండ్ల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిని మాజీ ఆలయ చైర్మన్ లెక్కల చిన కొండారెడ్డి ఆహ్వానించారు. శుక్రవారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో అంకినపల్లి ఓబుల్ రెడ్డి నరసింహారెడ్డి మరియు గ్రామ నాయకులతో కలిసి లెక్కల చిన కొండారెడ్డి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించారు. ఈనెల తొమ్మిదో తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయని, 14వ తేదీ జరుగు అలకల తోపు కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి మీ ద్వారా ఆహ్వానం అందించాలని ఎమ్మెల్యే గారిని కోరారు. ఆలయ కమిటీ కోరిక మేరకు మంత్రి ఆనం గారికి ఎమ్మెల్యే ఆహ్వానం అందించారు. అదే రోజు మీరు కూడా రావాలని ఆహ్వానించారు. వారితోపాటు ముఖ్య నాయకులు అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మాజీ చైర్మన్ లెక్కల చిన కొండారెడ్డి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇంతకుముందే ఎమ్మెల్యే గారికి ఆలయ కమిటీ ఆహ్వానం అందించిన విషయం అందరికీ తెలిసిందే.