కృష్ణారెడ్డి పాలెం లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ.

కలిగిరి మన న్యూస్:: కలిగిరి మండలం కృష్ణారెడ్డి పాలెం లో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. గడ్డం రంజాన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుపమ పరమేశన్ ను నూతన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సాయం కోరగా తక్షణమే విగ్రహ ఏర్పాటుకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు నగదు ఇచ్చి ఆమె దాతృత్వాన్ని చాటుకున్నారు. దాదాపు పది సంవత్సరాలుగా విగ్రహావిష్కరణకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో అడిగిన వెంటనే మాకు విగ్రహాన్ని ఇచ్చినటువంటి దాతఅనుపమ మేడంకు మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలిపారు. 135వ జయంతి రోజు కలిగిరి సీఐ వెంకటనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశానికి రాజ్యాంగాన్ని రచించి దిశా దశ సూచించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. మన దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ దిశా నిర్దేశం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని అయితే ఈ సమాజం అంతటి మహోన్నతమైన వ్యక్తిని కొన్ని సామాజిక వర్గానికి పరిమితం చేసిందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొన్ని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు అని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఆశాజ్యోతిని తెలిపారు మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు కొనియాడుతున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని వారి దయవల్ల రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును పౌర హక్కులను రచించారు రాజ్యాంగంతోనే పరిపాలన జరుగుతున్నది గుర్తించుకోవాలని తెలిపారు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగఫలం ద్వారానే ఇంతటి కీర్తి ప్రతిష్టలు పొందుతున్నానని అలాగే ఈ గ్రామంలోని ప్రజలందరూ రాజ్యాంగ విలువలు కాపాడి రిజర్వేషన్ ఫలాలు పొంది ప్రతి ఒక్కరూ ప్రగతి పథంలో ముందుకు నడవాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు గ్రామ గ్రామాన తెలియపరిచి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు

  • Related Posts

    అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

    శంఖవరం మన న్యూస్ (అపురూప్) ; జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పాలనా వికేంద్రీకరణకు గుర్తుగా “మా పంచాయతీ – మా గౌరవం” పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ సదస్సును గురువారం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్…

    సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) ఏలేశ్వరం మండలం యర్రవరంగ్రామములో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం నందు పేరెంట్స్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ముక్కు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు సింగిలిదేవి సత్తిరాజులు హాజరయ్యారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

    • By APUROOP
    • April 24, 2025
    • 2 views
    అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

    సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

    సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    • By JALAIAH
    • April 24, 2025
    • 6 views
    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు