ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్) :- జమ్మూ కాశ్మీర్ లోని పహాల్ గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు నేతృత్వంలో పార్టీ శ్రేణులు శాంతి ర్యాలీ చేపట్టాయి. ప్రత్తిపాడు లో మెయిన్ రోడ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సరైన బదులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ విచక్షణ రహితంగా పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి హేయమన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉగ్రవాద సంస్థలను అనిచివేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇలాంటి దాడులు చేయడం ఎంతో హేయమైన చర్య అని ఈ దాడిలో అమాయకులు నిండు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. అసువులు బాసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కిరాతకులను కఠినంగా శిక్షించాలన్నారు. దేశంలో ఇలాంటివి పునరావృతం కాకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గొంతెత్తి నినదించాలన్నారు. తప్పు చేసిన వారిని అణిచివేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు