పెనుమూరులో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ – టెట్ పరీక్ష నుండి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్

పెనుమూరు, మన ధ్యాస నవంబర్-21: ఈరోజు పెనుమూరు మండల పరిధిలోని శాతంభాకం, ఉగ్రాణం పల్లి, గుడ్యానం పల్లి, పెనుమూరు, ఎల్‌కేపీ తదితర ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టియు చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుండి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో పునఃపరిశీలన పిటిషన్ దాఖలు చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విద్యాహక్కు చట్టం సవరణ చేయించి, రెండు వేలు తొమ్మిదో సంవత్సరానికి ముందు వివిధ డిఎస్సీల ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు టెట్ నుండి పూర్తి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా ఉపాధ్యాయుల కోసం చైల్డ్ కేర్ లీవ్ సవరణ జీవో వెంటనే విడుదల చేసి, వయస్సుతో సంబంధం లేకుండా వారి సేవా కాలంలో ఎప్పుడైనా వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ఉమ్మడి సేవా నియమాలు రూపొందించి అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పన్నెండో వేతన సవరణ కమిషన్‌ను నియమించి, కనీసం ముప్పై శాతం మద్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులపై పెండింగ్‌లో ఉన్న సుమారు ముప్పై వేల కోట్ల ఆర్థిక బకాయిలను దశలవారీగా విడుదల చేయాలని, నిల్వలో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పదవ తరగతి విద్యార్థుల వందరోజుల కార్యక్రమంలో సెలవు రోజులను మినహాయించాలని, గత విద్యా సంవత్సరంలో వందరోజుల కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులకు సీసీఎల్ హక్కు వెంటనే కల్పించాలని కోరారు. ఖాళీగా ఉన్న పిఎస్ హెచ్‌ఎం పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచే పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎస్టియు నాయకులు జానకిరాం, మణి, సుబ్రహ్మణ్యం పిళ్ళై, గణపతి, కుమార్ స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

  • By RAHEEM
  • December 9, 2025
  • 5 views
సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

  • By RAHEEM
  • December 9, 2025
  • 5 views
మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.