మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-

కనుమళ్లలోని మలినేని లక్ష్మయ్య ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఫార్మసిస్టులు ప్రజల్లో సామాజిక అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, సెమినార్లు చేపట్టారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్. సాయి బాబు, మలినేని కాలేజెస్ డైరెక్టర్ డాక్టర్ ఏ. గోపాల కృష్ణమూర్తి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి. వెంకటేశ్వర్లు , అధ్యాపక బృందం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సింగరాయకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ఎన్. వంశీ ధర్మ హాజరై విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.ఈ ర్యాలీ సింగరాయకొండ బస్టాండ్ నుండి ప్రారంభమై కందుకూరు రోడ్ వరకు సాగి ప్రజల్లో ఫార్మసీ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *