ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా స్వచ్చ భారత్ – మొక్కలు నాటిన…..శ్రీరామగిరి శ్రీధర్

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ గవదగట్లవారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛభారత్ మరియు మొక్కలు నాటడం కార్యక్రమాన్ని (17 సెప్టెంబర్) మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు విద్యార్థులకు నోటుపుస్తకాలు, మిఠాయిలు పంపిణీ చేసి వారిని ప్రోత్సహించారు. అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి రక్షణ వలయం ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.తరువాత విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక నాయకులు కలిసి పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి పరిశుభ్రత ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి నాయకులు శ్రీరామగిరి శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. మోడీ గారు భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టారని, నిస్వార్ధంగా దేశ సేవకు జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.
మండల బిజెపి అధ్యక్షులు తల్లపనేని రమేష్ మాట్లాడుతూ – “మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం మనందరి గర్వకారణం. స్వచ్చ భారత్ ఉద్యమం ద్వారా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు,మండల BJP నాయకులుతన్నీరు శ్రీను, రామకృష్ణ,కుంచాల ప్రసాద్,శ్రీరామ మూర్తి,జాలిరెడ్డి మహిళా నాయకురాలు లక్ష్మి,జనసేన నాయకులు ఖాజా హుస్సేన్, అధ్యాపకులు అజయ్ చౌదరి,అంగన్వాడీ కార్యకర్త రజని,విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Related Posts

స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష.

బంగారుపాళ్యం సెప్టెంబర్ 17 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష బుధవారం…

ఎట్టకేలకు రాగిమానుపెంట రోడ్డు పనులు ప్రారంభం

బంగారుపాళ్యం సెప్టెంబర్ 17 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రం నుండి రాగిమానుపెంట రోడ్డు దుస్థితిపై చాలసార్లు ప్రముఖ పత్రికలలో వార్త ప్రచురించడం జరిగింది.వార్తలకు స్పందించిన అధికారులు బుధవారం జేసిపి సాయంతో రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష.

  • By NAGARAJA
  • September 18, 2025
  • 2 views
స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష.

ఎట్టకేలకు రాగిమానుపెంట రోడ్డు పనులు ప్రారంభం

  • By NAGARAJA
  • September 18, 2025
  • 2 views
ఎట్టకేలకు రాగిమానుపెంట రోడ్డు పనులు ప్రారంభం

12 ద్విచక్ర వాహనాల వేలం ద్వారా 1,51,000రూ ఆదాయం

  • By NAGARAJA
  • September 18, 2025
  • 2 views
12 ద్విచక్ర వాహనాల వేలం ద్వారా 1,51,000రూ ఆదాయం

శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు

శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు

సాయి నగర్ శ్రీ కనక దుర్గమ్మ కోవెల వద్ద ఘనంగా పందిరి రాట మహోత్సవం

సాయి నగర్ శ్రీ కనక దుర్గమ్మ కోవెల వద్ద ఘనంగా పందిరి రాట మహోత్సవం

ఈ నెల 22న హైదరాబాద్ లో జరుగు మాదిగల కృతజ్ఞత సభను జయప్రదం చేయండి.

  • By JALAIAH
  • September 18, 2025
  • 4 views
ఈ నెల 22న హైదరాబాద్ లో జరుగు మాదిగల కృతజ్ఞత సభను జయప్రదం చేయండి.