ఘనంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి రథోత్సవం

మన ధ్యాస కాణిపాకం సెప్టెంబర్-3 చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాది సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దివ్యరథాన్ని దర్శించుకోవడానికి వేచి ఉన్నారు. ఉత్సవమూర్తి శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం మహారథంపై ప్రతిష్టించారు. వేదమంత్రోచ్చరణలు, మంగళవాద్యాల మధ్య భక్తులు “జై భోలో గణేష్ మహరాజ్ కి జై” అంటూ రథాన్ని లాగారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తజనుల హర్షధ్వనులతో మార్మోగింది.
రథయాత్ర వీధులంతా భక్తుల తాకిడి పెరిగింది. మహిళలు మంగళహారతులు పట్టి స్వామివారికి ఆరతులు చూపగా, ఆ గణ నాధుడు భక్తుల హారతులు స్వీకరిస్తూ రధం పై ముందుకు సాగారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ పెంచాల కిశోర్ పుతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళి మోహన్  మాట్లాడుతూ – బ్రహ్మోత్సవాలు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి కాణిపాక గణనాథుని కృప పొందేలా ఘనంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!