జడ్పిపిఎఫ్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం నివారించాలి ఎస్ టి యు డిమాండ్

మన ధ్యాస చిత్తూరు ఆగస్ట్-29 జడ్పిపిఎఫ్ రుణాలు తుది మొత్తాల చెల్లింపులలో నెలకొన్న తీవ్ర జాప్యాన్ని నివారించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ)చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ టి యు చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మదన్మోహన్ రెడ్డి, మోహన్ యాదవ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం, శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణని కలిసి ఒక వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తమ జీతాల నుంచి నెల నెల పొదుపు చేసుకున్న మొత్తాల నుండి అవసరానికి రుణాలు పొందాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పదవీ విరమణ చెందినవారికి గౌరవప్రదంగా తుది మొత్తాలు చెల్లించాల్సి ఉండగా, నెలల తరబడి వారు తిరగాల్సి రావడం ఆవేదన కలిగిస్తోందన్నారు. మిస్సింగ్ క్రెడిట్స్  కు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జీతాల డ్రాయింగ్ అధికారులను పూర్తిస్థాయిలో భాగస్వాములను చేయాలని కోరారు. ఏ ఒక్క ఉద్యోగి తమ మిస్సింగ్ క్రెడిట్ జమ చేయడం కోసం పిఎఫ్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూడాలని కోరారు. పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లో జమ కాకుండా, సస్పెన్స్ అకౌంట్లో ఉన్న కోట్లాది రూపాయల మొత్తాలకు జమవుతున్న వడ్డీ ఏమవుతుందో పరిశీలించాలని కోరారు. వీలైనంత త్వరగా జిల్లాలోని డ్రాయింగ్ అధికారులు అందరితో, పిఎఫ్ సమస్యలకు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ మాట్లాడుతూ, తుది మొత్తాల చెల్లింపులకు సంబంధించి ఆడిట్ విభాగంలో ఎదురవుతున్న అభ్యంతరాలను పరిశీలించామని తెలిపారు. వీలైనంత వేగంగా రుణాలు తుది మొత్తాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీఎఫ్ మిస్సింగ్ క్రెడిట్స్ సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు
కార్యక్రమంలో నాయకులు దేవరాజులు రెడ్డి, చంద్రన్,శేఖర్, వాసు, బాలచంద్రారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గుణశేఖర్, ఢిల్లీ బాబు,భరత్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!