ఘనంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించిన మండల విద్యాధికారి హేమలత

మన ధ్యాస తవణంపల్లె ఆగస్టు 29:

ఈ రోజు అరగొండ ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యకమనికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి హేమలత హాజరయి అక్షరమాల గొప్పదనమే మన తెలుగు భాష మహత్యానికి నిదర్శనం. అచ్చులు, హల్లులు పలికేటప్పుడు ముఖమంతా సహజంగా కదులుతూ వ్యాయామం జరుగుతుందని పూర్వం గురువులు చెప్పిన సత్యం మరోసారి గుర్తుచేసుకోవలసిందే. తెలుగు భాష తియ్యని తేనేలాంటిది. సుందరమైన, సుమధురమైన, మృదుత్వంతో కూడిన ఈ భాషలో మాటలే కాక, మనసులోని భావాలను చిత్రంలా ఆవిష్కరించవచ్చు. “తెలుగులో వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుంది” అనడం వర్ణమాలలోని మెలికల వల్లే. అచ్చులు పలికేటప్పుడు ముఖం మొత్తానికి వ్యాయామం జరగగా, హల్లులు పలికేటప్పుడు కంఠం, నాలుక, పెదవులు కదులుతాయి. దీని వలన ఆరోగ్య పరమైన లాభాలు కూడా కలుగుతాయి. క ఖ గ ఘ ఙ పలకడం వల్ల కంఠ భాగం కదులుతుంది. చ ఛ జ ఝ ఞ పలకడం వల్ల నాలుక మొదటి భాగం కదులుతుంది. ట ఠ డ ఢ ణ పలకడం వల్ల నాలుక మధ్యభాగం కదులుతుంది.త థ ద ధ న పలకడం వల్ల నాలుక చివరి భాగం కదులుతుంది. ప ఫ బ భ మ పలకడం వల్ల పెదవులు కదులుతాయి. య ర ల వ శ ష స హ ళ క్ష ఱ పలకడం వల్ల నోరు మొత్తం కదులుతుంది. తెలుగు భాష కేవలం సంభాషణే కాదు, సాంస్కృతిక వారసత్వం. తెలుగువారి ఇంటి ముంగిట ముగ్గు ఎంత అందంగా ఉంటుందో, అలానే తెలుగు మనస్సు కూడా చక్కగా ఉంటుంది. అందుకే అందరూ తెలుగు మాట్లాడాలి, తెలుగు వ్రాయాలి, తెలుగు పుస్తకాలు చదవాలి. తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం మనందరి జీవితంలో ప్రతిధ్వనించాలి. అని మండల వైద్యాధికారి హేమలత తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..