ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళాకు విశేష స్పందన..!1000 ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా 20 కంపెనీలతో ఇంటర్వ్యూలు..!నిరుద్యోగ యువతీ యువకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్న కూటమి నేతలు..!

వింజమూరు,మనన్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ సారథ్యంలో వింజమూరులోని శ్రీ నేతాజీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న జాబ్ మేళాకు సోమవారం విశేష స్పందన లభించింది. డిగ్రీ కళాశాలలోని మూడు ఫ్లోర్లు ఉండగా ఒక్కొక్క ఫ్లోర్ కు ఒక కూటమి నేతను ఇంచార్జి గా నియమించి ఒక్కొక్క హెచ్ఆర్ కు ఒక వాలంటీరు ను అందుబాటులో ఉంచి సుమారు 20 తరగతి గదులలో 20 కంపెనీలతో ఇంటర్వ్యూలను వేగవంతంగా నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూలు అయిన వెంటనే అక్కడకు అక్కడే నియామక పత్రములు ఇస్తున్నారు. 1000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఇంటర్వ్యూలు నిర్వహించబడుతున్నాయి. డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ ఎస్.కె అబ్దుల్ ఖయ్యుమ్, రీజినల్ ప్లేసెమెంట్ ఆఫీసర్ శ్రీమతి కిరణ్మయి గార్ల పర్యవేక్షణలో కంపెనీల హెచ్ఆర్ లు యువతీ యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. కూటమి నాయకుల నేతృత్వంలో యువతీ యువకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చి విజయవంతంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. కళాశాల యాజమాన్యం సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కళాశాల కరస్పాండెంట్ కె.వి రత్నం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గురజాల రామ్ గోపాల్ అన్ని వసతులు సమకూర్చడంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య, చండ్ర మానస, మండల కన్వీనర్లు గొంగటి రఘునాథరెడ్డి, గూడా నరసారెడ్డి, సర్పంచ్ నల్లగొండ్ల సృజన,సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి,పోలినేని చంద్రబాబు నాయుడు, తెలుగు యువత దాసరి అశోక్, కొమ్మి ప్రభాకర్, పూసల వెంగప నాయుడు, అన్నపురెడ్డి వెంగళరెడ్డి, లెక్కల వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, చల్లా శ్రీనివాసులు యాదవ్, పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి, ఏగినేని శ్రీనివాసులు నాయుడు, పాములపాటి మాల్యాద్రి, కె.శ్రీనివాసులు నాయుడు, లేట్ జయన్న, భూమిరెడ్డి హజరత్ రెడ్డి, దొడ్డేటి పల్లి రామ్మోహన్ , అంకి పెద్దయ్య, తాళ్లూరి రమణయ్య, తాళ్లూరి మాధవ, గూడ నవీన్, భాష్యం వేరుకల నాయుడు, తిరుపతి ఆచారి, దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, పోరెడ్డి సునీల్, గున్నం శ్రీనివాసులు రెడ్ డిజనసేన నియోజకవర్గం కోఆర్డినేటర్ కొట్టే వెంకటేశ్వర్లు,వరికుంటపాడు జనసేన అధ్యక్షులు పటాన్ రసూల్, జలదంకి నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య, కే శ్రీనివాసులు, తదితర నాయకుల నేతృత్వంలో యువతీ యువకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చి విజయవంతంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. కళాశాల యాజమాన్యం సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు.

  • Related Posts

    కృష్ణాజీసేవలు మరువలేనివి

    మన న్యూస్ పాచిపెంట, జూన్ 30:- పార్వతీపురం మన్యం జిల్లాపాచిపెంట ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన కృష్ణాజీ రావు సేవలు జీవితంలో మరువలేమని సీనియర్ ఉపాధ్యాయులు యడ్ల నానాజీ రావు కొనియాడారు.సోమవారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట…

    పౌర హక్కుల పై గిరిజనులకు అవగాహన

    గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరులోని శంకర గిరిజన కాలనీలో సోమవారం సాయంత్రం తాసిల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ పౌర హక్కులపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఇల్లు లేని పేదలకు త్వరలోనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

    నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

    చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

    చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

    రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.

    రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.

    33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట

    • By RAHEEM
    • June 30, 2025
    • 8 views
    33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట

    కృష్ణాజీసేవలు మరువలేనివి

    కృష్ణాజీసేవలు మరువలేనివి

    పౌర హక్కుల పై గిరిజనులకు అవగాహన

    పౌర హక్కుల పై గిరిజనులకు అవగాహన