కృష్ణాజీసేవలు మరువలేనివి

మన న్యూస్ పాచిపెంట, జూన్ 30:- పార్వతీపురం మన్యం జిల్లాపాచిపెంట ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన కృష్ణాజీ రావు సేవలు జీవితంలో మరువలేమని సీనియర్ ఉపాధ్యాయులు యడ్ల నానాజీ రావు కొనియాడారు.సోమవారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆయన పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పంచాది కృష్ణాజీరావు ఇంటి వద్ద నుంచి పాచిపెంట ప్రధాన రహదారిలో ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులంతా ఊరేగింపుగా తీసుకెళ్లి ఆయనకు ఘనంగా సత్కరించారు. దారి పొడుగునా పువ్వుల వాన కురిపించారు. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు బంగారం చేసినందుకుగాను ఆయన వెంబడి ఆ పిల్లల తల్లిదండ్రులు పాత ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు కలసి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ కు హాజరయ్యారు. విజయవంతం చేశారు.అంతేకాకుండా గతంలో తాను ఆధ్యాత్మిక ప్రసంగాలు ద్వారా ఎంతో మంది జీవితాల్లో మార్పు తెచ్చినందుకుగాను సాలూరు,పాచిపెంట, రాంబద్రపురం, బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం బొబ్బిలి పట్టణాలు నుంచి పాత విద్యార్థులు ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు,వైద్యులు,రాజకీయ ప్రముఖులు పలువురు ఆయనకు ఘనంగా సత్కరించి వారి రుణం తీర్చుకున్నారు.పాచిపెంట చరిత్రలో ఇంతవరకు పదవి విరమణ కావించిన ఉపాధ్యాయులకు ఇటువంటి ఘన సత్కారాలు,వీడ్కోలు కార్యక్రమాలు జరగడం ఇదే మొదటిసారి అంటూ పలువురు పంచాది కృష్ణాజీకి బ్రహ్మ రధం పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆయన గురించి పొగుడుతూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురుని ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి వ్యక్తి మరలా మనకు దొరకడనే బాధతో నిట్టూర్పుతో మాట్లాడారు. రిటైర్మెంట్ అనంతరం ఆయన అరుణాచలం ఆ మహాదేవుడు పరమేశ్వరుడు సన్నిధిలో తన శేష జీవితాన్ని కొన సాగిస్తానని కృష్ణాజీ రావు తెలిపారు. పై కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.

Related Posts

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం స్థానిక బాలయోగి నగర్ మరియు ఊర్లపాలెం మెయిన్ పాఠశాలల నందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ నేడు పదవి విరమణ పొందిన జేడీ సుబ్బారావు మరియు రావినూతల డేవిడ్ జయకుమార్ లను ఘనంగా సన్మానించారు. ముందుగా మండల…

పౌర హక్కుల పై గిరిజనులకు అవగాహన

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరులోని శంకర గిరిజన కాలనీలో సోమవారం సాయంత్రం తాసిల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ పౌర హక్కులపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఇల్లు లేని పేదలకు త్వరలోనే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.

రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.

33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట

  • By RAHEEM
  • June 30, 2025
  • 8 views
33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట

కృష్ణాజీసేవలు మరువలేనివి

కృష్ణాజీసేవలు మరువలేనివి