

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలగా అప్ గైడ్ అయిన సందర్భంగా అదనపు తరగతులను ఎమ్మెల్యే సత్య ప్రభ రాజా ప్రారంభించారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్త నిర్వీర్యం అయ్యింది అన్నారు.నాడు _నేడు పేరిట కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అన్నారు.పాఠశాలకి రంగులు,పుస్తకాలపై బొమ్మలు వేసుకొని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని విమర్శించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సన్న బియ్యం పెడుతుంది అన్నారు.సమయానికి విద్యార్థులకు పుస్తకాలు, కిట్స్ పంపిణీ చేయడం, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు, గత ప్రభుత్వం నాసిరకం కిట్స్ ఇస్తే, కూటమి ప్రభుత్వం నాణ్యత తో కూడిన కిట్స్ పంపిణీ చేస్తుంది అన్నారు.ఎంతమంది విద్యార్థులు స్కూల్ కి వస్తే అంతమంది తల్లికి వందనం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు.