

మన న్యూస్ : వింజమూరు
ఉదయగిరి నియోజకవర్గం లోని వరికుంటపాడు సీతారాంపురం కలిగిరి జలదంకి వింజమూరు మండలాల టిడిపి మండల కమిటీలను తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో గురువారం మండలపార్టీ పరిశీలికులు బాణా శ్రీనివాసులు రెడ్డి,బీద గిరిధర్, వేలూరి కేశవ చౌదరి, ఆర్ వీరేంద్ర చౌదరి, మన్నవ రవిచంద్రరావుల,ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ అధ్యక్షతన, మండల నాయకుల సమక్షంలో ఎంపిక చేశారు. ఈ కమిటీలను జిల్లా కమిటీలకు అక్కడనుండి రాష్ట్ర కమిటీలకు పంపించి, ఆమోదం పొందిన అనంతరం, ప్రకటించడం జరుగుతుందని పరిశీలకులు తెలియజేశారు. మండల పార్టీ పదవులు, కొన్ని ఏకగ్రీవం కాగా, మరికొన్ని పదవులకు, ఇద్దరు ముగ్గురు పేర్లు పంపించడం జరిగింది. అధిష్టానం ఆదేశాల మేరకు తుది మెరుగులు జాబితా తయారు చేయబడుతుంది.
ఈ కార్యక్రమంలో ఐదు మండలాల కన్వీనర్లు పరిశీలకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.