

- మామిడి రైతులకు నేను అండగా ఉంటా ప్రభుత్వ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్
- ప్రతి పంటను యాజమాన్యం ద్వారా కొనుగోలు చేపిస్తా ఎవరు ఎవరు ఆదర్య పడకండి మామిడి రైతులకు భరోసా కల్పించిన జీడి నెల్లూరు ఎమ్మెల్యే
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- మామిడి రైతులకు నేను అండగా ఉంటా అని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు. బుధవారం గొల్లపల్లి జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద రైతులను ఆకలితో ఉన్నారని తెలుసుకుని వారికి ఆహార ప్యాకెట్లను వాటర్ బాటిల్ ను స్వయంగా కిలోమీటర్లు నడిచి రైతులకు, ట్రాక్టర్ డ్రైవర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి రైతులకు ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు. కొంతమంది మామిడి రైతులకు తప్పుడు సమాచారాన్ని దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వాటిని రైతులు నమ్మకండి నమ్మకండి అని అన్నారు. నేను రైతు బిడ్డని రైతు కష్టాలు నాకు అన్నీ తెలుసని ప్రతి మామిడి రైతులకు మామిడి పంటను యాజమాన్యం ద్వారా కొనుగోలు చేపిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు స్వామిదాస్, జిల్లా నాయకుడు కృష్ణమ నాయుడు, జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, దేవ సుందరం, హరీష్ యాదవ్, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
